చైనా సామర్థ్యంతో సరితూగుతాం: చైనా కవ్వింపు చర్యలపై జై శంకర్
సరిహద్దులో డ్రాగన్ చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారీగా బలగాలను మొహరించడం.. సరిహద్దుల్లోకి చొచ్చుకొని రావడంతో భారత్ కూడా ధీటుగానే బదులిస్తోంది. చైనా సామర్థ్యాలతో భారత్ సరితూగుతోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టంచేశారు. తూర్పు లడాఖ్ వద్ద గల పొంగాంగ్ నదీ వద్ద చైనా సేనలు చొచ్చుకురావడంతో జై శంకర్ ఈ కామెంట్స్ చేశారు.
Recommended Video
సరిహద్దుల్లో చైనాలో ఇలాగే వ్యవహరిస్తే. భారత్ కూడా అలాగే వ్యవహరించవలసి వస్తోందని హెచ్చరించారు. దీనిని చైనా గుర్తించాలని పేర్కొన్నారు. ఆయన భారత్ అమెరికా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం అన్యువల్ లీడర్ షిప్ సమ్మిట్లో మాట్లాడారు. ఆయుధ సంపత్తిలో తమను మించి భారత్ లేదు అని చైనా అనుకుంటుందో ఏమో.. అదీ నిజం కాదు.. డ్రాగన్ కంట్రీతో తాము సరితూగుతాం అని చెప్పారు. కానీ రెండు దేశాల ఘర్షణ ఇతరదేశాలు/ ప్రపంచానికి మంచి కాదనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.