వరసగా మూడోరోజు.. భూభాగంలోకి చొరబడే ప్రయత్నం.. తోకముడిచిన చైనా..
సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రిగేడ్ కమాండర్ స్థాయి అధికారులు చర్చల ప్రక్రియ కొనసాగుతోండగా.. డ్రాగన్ దళాలు దుందుకుడుగా వ్యవహరిస్తున్నాయి. చుమార్ వద్దకు చైనా దళాలు వచ్చేందుకు విఫల ప్రయత్నం చేశాయి. అయితే భారత దళాలు వేగంగా స్పందించడంతో తోక ముడిచి పారిపోయాయి. మంగళవారం జరిగిన ఈ ఘటన.. వరసగా మూడోరోజు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
చేపుజీ శిబిరం నుంచి ఎల్ఏసీ వైపు చైనా సైన్యానికి చెందిన 8 భారీ వాహనాలు వెళ్లినట్టు ఇండియా టుడే రిపోర్ట్ చేసింది. దీంతో భారత దళాలు కూడా మొహరించాయి. భారత దళాలను చూసి చైనా వెనక్కి మళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. ఎల్ఏసీ వెంట చొరబడేందుకు చైనా విఫల ప్రయత్నం చేస్తున్నందున దళాలు మరింత అప్రమత్తంగా న్నాయి.
గత నెల 29-30వ తేదీల్లో భారత్ ప్రదేశంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా విఫల ప్రయత్నం చేసిందని భారత వర్గాలు తెలిపాయి. చైనా దళం పదే పదే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీ వాస్తవ తెలిపారు.