భారత సైనికులు... పాకిస్థాన్ సైన్యం వలే దేశభక్తి లేని వాళ్లు కాదు... పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్
జమ్ము కశ్మీర్ విభజన అంశంలో అవకాశం ఎపుడు దొరుకుందా అనే అలోచనలో పాకిస్థాన్ ప్రధాన మంత్రితో పాటు అక్కడి మంత్రులు కూడ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పంజాబ్ రాష్ట్ర సైనికులపై పాకిస్థాన్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. విభజించి పాలించే విధంగా పాకిస్థాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు.
పాకిస్థాన్ భారత దేశాన్ని మరోసారి విభజించి పాలించు అనే సూత్రంతో ముందుకు పోతున్నట్టు కనిపిస్తోంది. ఈనేపథ్యంలోనే ఇప్పటి వరకు ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి సారించిన పాకిస్తాన్, ఇరు దేశాల మధ్య వ్యాపార, మానవ సంబంధాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జమ్ము కశ్మీర్లో తమ వ్యూహాలు అమలు కాకపోవడంతో ఇప్పుడు పాకిస్థాన్ నాయకుల దృష్టి పంజాబ్ రాష్ట్రం పై పడింది.
ఈ నేపథ్యంలోనే కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న పంజాబ్ సైనికులు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ విధులు నిర్వహించేందుకు నిరాకరించాలని పాకిస్థాన్ మంత్రి ఫావద్ చౌదరి ట్విట్టర్లో పేర్కోన్నారు. దీంతో పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. స్వతహాగా సైనికుడైన అమరిందర్ సింగ్ భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. భారత సైన్యం చాల క్రమశిక్షనణతో కూడికుని విధులు నిర్వహిస్తారని,రెచ్చగొట్టే వ్యాఖ్యలు సైనికులపై పని చేయవని ఫైర్ అయ్యారు.