వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో 38 నగరాలు హైరిస్క్ భూకంప జోన్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేపాల్ భారీ భూకంపం అందర్నీ కలచివేస్తోంది. ప్రపంచం దిగ్భ్రాంతికి గురయింది. యావత్ ప్రపంచం నేపాల్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. భారత్ తక్షణమే స్పందించి, పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తోంది. నేపాల్ భూకంపం భారత్‌ను కూడా తాకింది. ఈ తాకిడికి 72 మంది మృతి చెందినట్లు కేంద్రం ప్రకటించింది.

ఇదిలా ఉండగా, భారత దేశంలో 38 నగరాలు అత్యధిక భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. నేపాల్ భూకంపం నేపథ్యంలో ఉత్తారాది రాష్ట్రాల్లో భారీ నష్టం జరిగింది. హిమాలయాలలో వచ్చే భూప్రకంపనల వల్ల ఆసియా ప్రధాన ప్రాంతాల పైన ప్రభావం పడనుంది.

Indian cities in high-risk earthquake zones

భారత దేశంలో చాలా తక్కువ భవనాలు మాత్రమే భూకంపాలను తట్టుకునే ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు. 1962లో, 2005లో భూకంపాలను తట్టుకునేలా నిర్మించే ప్రమాణాలు రూపొందించారు. అయితే, దాదాపు అవి ఎవరికీ తెలియవని చెప్పవచ్చు.

భూకంపాలను తట్టుకొనే స్థాయిలో నిర్మించిన వాటిలో ఢిల్లీ మెట్రో ఒకటి. గుజరాత్‌లో 2001లో వచ్చిన భుజ్ భూకంపం అనంతరం... చాలా ఇళ్లు అక్కడ ప్రమాణాలతో నిర్మించారు.

గతంలో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో 6.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు దాదాపు పదివేల మంది మృతి చెందారు. చాలామంది భూకంపం వచ్చినప్పుడు... ఇళ్లు కూలడం వంటి వాటి వల్లనే చనిపోతున్నారు. ప్రమాణాల ప్రకారం నిర్మిస్తే ప్రాణ నష్టం తగ్గుతుంది. భారత దేశంలో మొత్తం 38 నగరాలు హైరిస్క్ భూకంపం జోన్లో ఉన్నాయి.

English summary
At least 38 Indian cities lie in high-risk seismic zones and nearly 60 percent of the subcontinental landmass is vulnerable to earthquakes. Barring rare exceptions, such as the Delhi Metro, India's hastily-built cities are open to great damage from earthquakes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X