వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థానీ చేతిలో భారతీయ దంపతుల దారుణ హత్య: నిందితుడి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

షార్జా: దుబాయ్‌లో భారతీయ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో నిందితుడు ఓ పాకిస్థానీ కావడం గమనార్హం. జూన్ 18న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. భారతదేశానికి చెందిన హీరెన్ అధియా భార్య విధి అధియాతో కలిసి రెండు సంవత్సరాల క్రితం దుబాయ్ కి వెళ్లాడు.అరేబియన్ రాంచెస్‌లో నివాసం ఉంటున్నారు.

 Indian couple killed in Dubai by Pakistani national, accused held

షార్జాలో వ్యాపారం నిర్వహిస్తున్న హీరెన్ వ్యాపార నిమిత్తం జూన్ 18న యూఏఈకి వెళ్లాడు. కాగా, పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి.. హీరెన్, అతని భార్య విధి అధియా నుంచి డబ్బులు, నగలు దోచుకున్నాడు.అంతేగాక వారిద్దరినీ హత్య చేసి, పరారయ్యాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి డబ్బు, నగలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత హీరెన్ దంపతుల హత్యకు సంబంధించి దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ లో సమాచారం అందించారు. డబ్బు, నగల కోసమే నిందితుడు ఈ హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

English summary
An Indian couple was murdered in Dubai, UAE in the early hours of June 18, 2020, by a Pakistani national.Sources said it was a case of break-in and robbery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X