ట్రంప్ హెచ్1బి షాక్: లాబీయింగ్ కోసం భారత టెక్ కంపెనీల సీఈవోలు
హెచ్1బి వీసా పైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇది భారత దేశంలో, ఇండియన్ ఐటీ కంపెనీలలో కలకలం రేపుతోంది.
ముంబై: హెచ్1బి వీసా పైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇది భారత దేశంలో, ఇండియన్ ఐటీ కంపెనీలలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ను కలిసి, సమస్య పరిష్కరించుకునేందుకు భారత ఐటీ దిగ్గజ కంపెనీల సీఈవోలు ఈ నెల 20వ తేదీన వాషింగ్టన్ వెళ్లనున్నట్లు చెప్పారు.
హెచ్1బీ ఊరట ప్రకటన: 'ఇండియన్స్కు మరిన్ని అవకాశాలు'
150 బిలియన్ డాలర్ల విలువైన భారత ఐటీ ఇండస్ట్రీ నష్టపోకుండా చూసేందుకు అమెరికా వెళ్లి లాబీయింగ్ చేయాలని నిర్ణయించినట్టు నాస్కామ్ చైర్మన్ ఆర్ చంద్రశేఖరన్ తెలిపారు. ఐటీ కంపెనీల సీఈఓలు ట్రంప్ ను కలవనున్నట్టు తెలిపారు.
కాగా, హెచ్-1బీ వీసా పొందాలంటే ఇంతవరకూ కనీస వేతనం 60 వేల డాలర్లు, ఇప్పుడు దాన్ని 1.30 లక్షల డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. అంత వేతనాలు ఇవ్వాలంటే, ఐటీ కంపెనీలు కలవరపడుతున్నాయి. తమపై భారం పెరుగుతుందని, దీంతో నష్టపోతామన్నది ఐటీ కంపెనీల వాదన.