విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తీరంలో విద్యుత్ వెలుగులు: కరోనా వారియర్స్‌కు భారత నావికా దళం సెల్యూట్(వీడియోస్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా బాధితులను కాపాడేందుకు అహర్నిశలు పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని భారత ఆర్మీ, ఐఏఎఫ్, నేవీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆర్మీ, నేవీలు ఆస్పత్రులు, వైద్య సిబ్బందిపై ఆదివారం పూల వర్షం కురిపించాయి.

Recommended Video

Watch Indian Navy Salutes Tribute to Corona Warriors on Land, Air and Sea

కరోనా వారియర్స్‌కు వందనం

ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 12గంటల వరకు భారత నావికా దళాలు షిప్పులను విద్యుత్ కాంతులతో విశాఖపట్నం, ముంబై, చెన్నై, కొచ్చిలో కరోనా వారియర్స్ కు సెల్యూట్ చేశాయి. ముంబై ప్రాంతంలో విద్యుత్ దీపాల కాంతుల్లో షిప్.

వారందరికీ సెల్యూట్

కేరళలోని కొచ్చి తీర ప్రాంతంలో భారత నావికా దళం నౌకల్లో విద్యుత్ దీపాలాంకరణ చేసి కరోనా వారియర్స్‌కు ధన్యవాదాలు తెలిపాయి.

విశాఖ తీరంలో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం తీరంలో నేవీ నౌకలు విద్యుత్ ఆలంకరణతో కరోనా వారియర్స్ కు సెల్యూట్ చెప్పాయి.

కృతజ్ఞతలు

కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న సిబ్బందికి భారత తీరప్రాంత రక్షక దళాలు కృతజ్ఞతలు తెలిపాయి.

గోవా తీరంలో...

గోవా తీరంలో భారత నావికాదళం నౌకలు కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాయి.

ఐఎన్ఎస్ విక్రమాదిత్య సెల్యూట్

కరోనా వారియర్స్‌కు ఐఎన్ఎస్ విక్రమాదిత్య సెల్యూట్ చేసి ఈ విధంగా ధన్యవాదలు తెలిపింది.

English summary
Indian Navy salute to Coronavirus warriors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X