సల్మాన్ రష్దీని పొగిడినందుకు, ఇటుకతో ముఖంపై చితకొట్టారు
హెన్స్బర్గ్: దక్షిణాఫ్రికాలో భారత సంతతికి చెందిన రచయితపై దాడి జరిగింది. జైనుబ్ ప్రియా దలా అనే రచయిత్రిని అతి కిరాతకంగా కొట్టారు. డర్బిన్లోని ఓ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో జైనుబ్ ప్రియా దలా, వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీ ప్రశంసించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఈ సంఘటన గత వారం చోటుచేసుకుంది. జైనుబ్ ప్రియా దలా శనివారం తన 'వాట్ ఎబౌట్ మీరా' నవలను శనివారం విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆమె దాడిలో గాయపడటంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది.
హోటల్ నుంచి ఆమె కారులో బయలుదేరగా, ముగ్గురు వ్యక్తులు మరో వాహనంలో వెంబడించారు. మార్గ మధ్యంలో ఆమె కారుని అడ్డగించి ఆమెపై దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించారు. ముగ్గురి దుండగుల్లో ఒకడు ఆమె మెడపై కత్తి పెట్టగా, మరో వ్యక్తి ఆమె ముఖంపై ఇటుకతో కొట్టాడు.
దీనిపై వివాదాస్పద రచయిత సల్మాన్ రష్టీ స్పందించారు. ఇది భయానకమైన, అవమానకరమైన సంఘటన అని పేర్కొన్నారు. ఆమె త్వరగా కొలుకోవాలని ట్విట్టర్లో ఆకాంక్షించారు.
“Breaking
news:
author
@zpdala
was
assaulted
for
admiration
of
@SalmanRushdie
http://t.co/APkX3Ez9ye”
This
is
appalling
and
disgraceful.
—
Salman
Rushdie
(@SalmanRushdie)
March
20,
2015
సల్మాన్ రష్దీ రచించిన రచనలు ఇస్లాంకు వ్యతిరేకమని, అతనిపై ప్రపంచ వ్యాప్తంగా ఫత్వా విధించిన సంగతి తెలిసిందే.