వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికాలో భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి
కార్నెల్ ఇంజినీరింగ్ కాలేజీలో సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న ఆలాప్ నరసిపురా మే 17 నుంచి కనిపించకుండా పోయాడు. కాగా, పాల్ క్రీక్ ప్రాంతంలో ఓ మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి
వాషింగ్టన్: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కార్నెల్ ఇంజినీరింగ్ కాలేజీలో సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న ఆలాప్ నరసిపురా మే 17 నుంచి కనిపించకుండా పోయాడు.
కాగా, పాల్ క్రీక్ ప్రాంతంలో ఓ మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించారు. అది నరసిపురాదేనని గుర్తించారు. అయితే నరసిపురా మృతిపై ఇప్పటివరకూ ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నరసిపురా చురుకైన విద్యార్థి అని, అతడు, తాను రోజూ ఫొటోలు దిగేవాళ్లమని క్యాంపస్ లైఫ్ విద్యార్థి వైస్ ప్రెసిడెంట్ ర్యాన్ లంబార్డి తెలిపారు. నరసిపురా ఇక్కడే తన మాస్టర్ డిగ్రీ చేయాలని కూడా ప్రణాళికలు వేసుకున్నాడని, అంతలోనే ఇలా జరగడం బాధాకరమని అన్నారు.
English summary
A 20-year-old Indian-origin ornell University student was found dead here after going missing this week.
Story first published: Saturday, May 20, 2017, 14:48 [IST]