వీడియో: మేకిన్ ఇండియా మరి! గంటకు 180 కి. మీ వేగంతో పరుగెత్తే రైలింజన్
Recommended Video
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తొలి హయాంలో ఆరంభించిన మేకిన్ ఇండియా ఫలితాలను ఇవ్వడం మొదలు పెట్టింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రైలింజన్ పట్టాలు ఎక్కింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తడం ఆ ఇంజిన్ ప్రత్యేకత. ఈ ఇంజిన్ ను ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. టెస్ట్ రన్ లో ఈ రైలు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల ను అందుకుంది. రాజస్థాన్ లోని కోటా - సవాయ్ మధోపూర్ సెక్షన్ మధ్య ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
పోటెత్తిన తుంగభద్ర: సుంకేశుల గేట్లు ఎత్తివేత..శ్రీశైలానికి మరింత వరద ప్రవాహం
ఈ ఇంజిన్ తయారు చేయడానికి 100 కోట్ల రూపాయలను వ్యయం చేశారు. పశ్చిమ బెంగాల్ లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్ షాప్ లో హైస్పీడ్ రైలు ఇంజన్లను తయారు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దార్శనికత ఫలితంగా ఈ అద్భుతం సాధ్యపడిందని పియూష్ గోయల్ అన్నారు. మోడీ నేతృత్వంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా హైస్పీడ్ రైలు ఇంజన్ల తయారీని చేపట్టినట్లు తెలిపారు. రైలు ప్రయాణ వ్యవధిని గణనీయంగా తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రయాణికులు ఇక తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అన్నారు.
ఇదివరకు మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రైల్వే మంత్రిత్వశాఖ ఇంజిన్ రహిత రైలును తయారు చేసిన విషయం తెలిసిందే. వందేభారత్ పేరుతో పట్టాలెక్కింది ఈ రైలు. ప్రస్తుతం ఢిల్లీ-వారణాశి మధ్య నడుస్తోంది. దీని గరిష్ఠ వేగం 120 కిలోమీటర్లు. ఇప్పటిదాకా ఇదే అత్యధిక వేగంతోొ పరుగులెత్తే రైలుగా పేరు నమోదు చేసుకుంది. తాజాగా ఈ 180 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు అందుబాటులోకి వస్తే.. దాని రికార్డు కనుమరుగౌతుంది. తాజాగా రైలింజన్ ను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకుని రావడానికి మరికొంత సమయం పడుతుందని పియూష్ గోయల్ అన్నారు.
Railways has manufactured a high speed locomotive in West Bengal's Chittaranjan Locomotive Works, achieving a top speed of 180km/hr.
— Piyush Goyal (@PiyushGoyal) August 12, 2019
This new locomotive produced under 'Make In India' initiative, will speed up trains like never before.
Watch the video: pic.twitter.com/E5QCi0dSa7