వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇటలీలో భారత విద్యార్థులపై దాడి: సమీక్షిస్తున్న సుష్మా

ఇటలీలోని మిలాన్‌లో భారతీయ విద్యార్థులపై దాడి జరిగింది. ఈ మేరకు మిలాన్‌లో భారత కాన్సులేట్‌ వెల్లడించింది. అయితే విద్యార్థులు ఆందోళన చెందొద్దని, ఘటనపై విచారిస్తున్నామని తెలిపింది.

|
Google Oneindia TeluguNews

మిలాన్‌: ఇటలీలోని మిలాన్‌లో భారతీయ విద్యార్థులపై దాడి జరిగింది. ఈ మేరకు మిలాన్‌లో భారత కాన్సులేట్‌ వెల్లడించింది. అయితే విద్యార్థులు ఆందోళన చెందొద్దని, ఘటనపై విచారిస్తున్నామని తెలిపింది.

ఈ ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా స్పందించారు. 'దాడిపై అన్ని వివరాలను తెలుసుకున్నాను. విద్యార్థులు కంగారుపడొద్దు. వ్యక్తిగతంగా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాను' అని సుష్మాస్వరాజ్‌ ట్వీట్‌ చేశారు.

Indian student attacked in Italy's Milan; Swaraj monitoring situation

అంతకుముందు 'మిలాన్‌లో కొందరు భారతీయ విద్యార్థులపై దాడి జరిగినట్లు కాన్సులేట్‌కు నివేదికలు వచ్చాయి. అయితే దీనిపై మిగతా విద్యార్థులు ఆందోళన చెందవద్దు. ఘటన గురించి సంబంధిత అధికారులతో చర్చిస్తున్నాం' అని మిలాన్‌లోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తమ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

అయితే ఈ దాడులు ఎవరిపై, ఎందుకు జరిగాయో అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. భారత విద్యార్థులు బయటకు వెళ్లినప్పుడు ఒకరితో ఒకరు సంప్రదించుకోవాలని కాన్సులేట్‌ జనరల్‌ సూచించింది. విద్యార్థులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

English summary
External Affairs Minister Sushma Swaraj on Tuesday tweeted out about an Indian Students attacked in Milan city in Italy and that she is personally monitoring the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X