ఆ విషయంలో పాపం ఆడవాళ్లు వెనకడుగు, సర్వే
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఏ రంగంలో చూసినా ఇంటర్ నెట్ తప్పని సరి అయ్యింది. చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరూ ఇంటర్ నెట్ ఉపయోగిస్తున్నారు. ఒక్కోక్క సారి ఇంటరె నెట్ లేనిదే పనులు ముందుకు సాగని పరిస్థితులు ఎదురైనాయి.
అయితే ప్రపంచదేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో ఇంటర్ నెట్ ఉపయోగించే యువతులు, మహిళల సంఖ్య చాల తక్కువగా ఉందని వెలుగు చూసింది. భారతదేశంలో 49 శాతం మంది మహిళలు ఇంటర్ నెట్ కుదూరంగా ఉంటున్నారని స్పష్టం అయ్యింది.
ఇంటర్ నెట్ సేవలు అందిస్తున్న గూగుల్ భారత్ లో ఎంత మంది మహిళలు ఇంటర్ నెట్ ఉపయెగిస్తున్నారు అని ‘‘ఉమెన్ అండ్ టెక్నాలజీ'' పేరుతో ఒక సర్వే చేశారు. 8 సంవత్సరాల నుండి 55 ఏళ్ల ఉన్న 828 మంది మహిళలను ప్రశ్నించి వివరాలు సేకరించారు.
అందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయని గూగుల్ నిర్వహకులు తెలిపారు. సమయం చిక్కకపోవడం, సరైన సమయంలో కనెక్షన్ లు పొందే వీలు లేకపోవడం, ఖర్చులు ఎక్కువ కావడం, టైం లేకపోవడం వంటి కారణాలతో ఇంటర్ నెట్ కు దూరం అవుతున్నారు.
ఇంటి పనులతో అలసి పోయి విశ్రాంతి తీసుకోవాడానికి ప్రాదాన్యత, ఆన్ లైన్ లో ఎక్కువ సమయం ఉంటే అత్తమామలు ఆగ్రహిస్తారని చాల మంది మహిళలు భయపడుతున్నారు. ఇంటర్ నెట్ ఉపయెగించాలంటే స్వేచ్చ కావాలని చాల మంది మహిళలు అంటున్నారు. ఇంటర్ నెట్ ఉపయోగించేవారు. ఇంటర్ నెట్ ఉపయోగించని వారిలో చాల తేడా ఉందని వెలుగు చూసింది.