విదేశాల్లోని భారతీయులు టికెట్ కొనాల్సిందే: 64 విమానాలు, ఏయే రాష్ట్రాల నుంచి ఎన్నంటే.?
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు ప్రారంభించింది. వారిని దశలా వారీగా స్వదేశానికి తీసుకొస్తామని ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Recommended Video
భారత్లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..
ఏడు రోజుల్లో 14,800 మంది..
భారతీయులను
తీసుకొచ్చేందుకు
64
విమానాలను
నడపాలని
యోచిస్తోంది.
మే
7
నుంచి
13
వరకు
మొత్తం
12
దేశాల్లోని
దాదాపు
14,800
మంది
భారతీయుల్ని
స్వదేశానికి
తీసుకువచ్చేందుకు
ఏర్పాట్లు
చేస్తున్నామని
ప్రభుత్వ
సీనియర్
అధికారి
ఒకరు
తెలిపారు.
ఆయా దేశాలకు ప్రత్యేక విమానాలు..
భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఎయిరిండియా, దాని అనుబంధ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేక విమానాలను నడపనున్నాయన్నారు. యూఏఈ, యూకే, అమెరికా, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాల నుంచి భారతీయులను వెనక్కి రప్పించనున్నారు.
ఎవరి ఖర్చులు వారే భరించాలి
కాగా, విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను విమానాలు, నౌకాదళ ఓడల్లో తరలించేందుకు ప్రామాణిక నిర్వహణ విధానం(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్-ఎస్ఓపీ) సిద్ధం చేసినట్లు కేంద్ర హోంశాఖ ఇప్పటికే ప్రకటించింది. భారతీయులు స్వదేశంలో అడుగుపెట్టిన తర్వాత వారికి అవసరమైన పరీక్షలు, క్వారంటైన్ సౌకర్యాలు రాష్ట్రాలే ఏర్పాటు చేయాలని, ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని తెలిపింది. అయితే, స్వదేశానికి వచ్చే విదేశాల్లోని భారతీయులు ఎవరి ఖర్చులు వారే భరించుకోవాల్సి ఉంటుందని విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పురి మంగళవారం స్పష్టం చేశారు.
ఏ రాష్ట్రాల నుంచి విమానాలు..
మే 7 నుంచి మే 13 మధ్య 64 విమానాలు నడపనున్న కేంద్రం.. యూఏఈకి 10 విమానాలు, అమెరికా, యూకేలకు చెరో ఏడు చొప్పున విమానాలను నడపనుంది. అలాగే, సౌదీ అరేబియాకు ఐదు, సింగపూర్కు ఐదు, ఖతార్ కు రెండు చొప్పున విమానాలు నడపనుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మలేషియా, బంగ్లాదేశ్లకు చెరో ఏడు, కువైట్, ఫిలిప్పీన్స్ కు చెరో ఐదు, ఒమన్, బహ్రెయిన్కు చెరో రెండు చొప్పున విమానాలు నడిపే అవకాశం ఉంది. మొత్తం 64 విమానాల్లో కేరళ నుంచి 15, ఢిల్లీ, తమిళనాడు నుంచి చెరో 11, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి చెరో ఏడు, మిగితా రాష్ట్రాల నుంచి ఐదు చొప్పున విమానాలు నడుస్తాయని తెలిపారు. ఏడు రోజుల్లో 14,800 మంది భారతీయులు చేరుకుంటారని, మిగితా వారిని తీసుకొచ్చేందుకు మే 13 తర్వాత కేంద్రం మరిన్ని విమానాలు నడుపుతుందని వెల్లడించారు.