పని తీరు బాగా లేదంటే బాంబు ఉందని పోన్, అరెస్ట్
న్యూఢిల్లీ: పనితీరు సరిగా లేదని సీనియర్ ఉద్యోగులు వార్నింగ్ ఇవ్వడంతో ఎయిర్లైన్స్కు కాల్ చేసి బుద్ది చెప్పాలనుకొన్న ఓ ఉద్యోగి ఇండిగో విమానంలో బాంబు ఉందని ఫోన్ చేసి చెప్పాడు. ఈ విషయాన్ని నిందితుడే పోలీసుల విచారణలో వెల్లడించాడు.
మహారాష్ట్రలోని పూణేకు చెందిన కార్తీక్ మాధవ్ భట్ హాస్పిటలాలిటీలో డిప్లొమా కోర్స్ పూర్తి చేశాడు. అనంతరం ఇండిగో ఎయిర్లైన్స్లో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ గా విదుల్లో చేరారు.
వర్క్ బాగా చేయడం లేదని, ఇంకా పనితీరు మెరుగుపర్చుకోవాలని సీనియర్లు కార్తీక్కు ఇటీవల హెచ్చరించారు. దీంతో ఇండిగో ఎయిర్లైన్స్కు బుద్ది చెప్పాలని భావించాడు. మే 2న ముంబైకి వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందని ఫోన్ చేశాడు.
అయితే ఈ విషయమై అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు ప్రయాణీకుల లగేజీతో పాటు విమానాన్ని తనిఖీ చేశారు. అయితే ఈ ఫోన్ ఫేక్ కాల్ అంటూ తేల్చి చెప్పారు.
విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కార్తీక్ను తాజాగా అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. తన పనితీరు బాగున్నా సీనియర్ ఉద్యోగులు వంకలు పెట్టారన్న కారణంగా ఇండిగో ఎయిర్లైన్స్కు ఫోన్చేసి బాంబు అని బెదిరించినట్లు నిందితుడు అంగీకరించాడు.