ఇండిగో ఆఫర్స్: విశాఖ-హైదరాబాద్ రూ.1,259
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు మరో ఆఫర్ను ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో టికెట్ ప్రారంభ ధరను రూ.1,112గా నిర్ణయించింది. జమ్మూ-శ్రీనగర్ టికెట్ ధర రూ.1,112గా ఇండిగో తన వెబ్సైట్లో పేర్కొంది.
అంతేగాక, కోయంబత్తూరు- చెన్నై ప్రారంభం ధర రూ.1,195గాను, విశాఖపట్నం-హైదరాబాద్ రూ.1,259గాను, పాట్నా-కోల్కతా రూ.1,264గాను, బెంగళూరు-చెన్నై రూ.1,285గాను పేర్కొంది. జనవరి రెండో వారంలో ప్రయాణానికి ఈ ధరలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
నూతన సంవత్సరం, పండగల దృష్ట్యా ఇండిగో ఈ ఆఫర్ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక మరో విమానయాన సంస్థ ఎయిర్ఏసియా కూడా లిమిటెడ్ పీరియడ్ ప్రమోషనల్ స్కీమ్ కింద ఎంపిక చేసిన విమానాల్లో 40 శాతం తగ్గింపును అందిస్తోంది.
జనవరి 15 నుంచి ఏప్రిల్ 25 మధ్య ప్రయాణానికి గాను ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆ సంస్థ వెల్లండించింది. డిసెంబర్ 3 వరకు ఇందుకుగాను బుకింగ్కు అవకాశం కల్పిస్తున్నట్లు తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో మరికొన్ని దేశీయ విమానయాన సంస్థలు కూడా ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది.