వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండిగో ఆఫర్స్: విశాఖ-హైదరాబాద్‌ రూ.1,259

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు మరో ఆఫర్‌ను ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో టికెట్‌ ప్రారంభ ధరను రూ.1,112గా నిర్ణయించింది. జమ్మూ-శ్రీనగర్‌ టికెట్‌ ధర రూ.1,112గా ఇండిగో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

అంతేగాక, కోయంబత్తూరు- చెన్నై ప్రారంభం ధర రూ.1,195గాను, విశాఖపట్నం-హైదరాబాద్‌ రూ.1,259గాను, పాట్నా-కోల్‌కతా రూ.1,264గాను, బెంగళూరు-చెన్నై రూ.1,285గాను పేర్కొంది. జనవరి రెండో వారంలో ప్రయాణానికి ఈ ధరలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

IndiGo Offers Rs. 1,112 Tickets On Select Flights. Details Here

నూతన సంవత్సరం, పండగల దృష్ట్యా ఇండిగో ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక మరో విమానయాన సంస్థ ఎయిర్‌ఏసియా కూడా లిమిటెడ్‌ పీరియడ్‌ ప్రమోషనల్‌ స్కీమ్‌ కింద ఎంపిక చేసిన విమానాల్లో 40 శాతం తగ్గింపును అందిస్తోంది.

జనవరి 15 నుంచి ఏప్రిల్‌ 25 మధ్య ప్రయాణానికి గాను ఈ ఆఫర్‌ వర్తిస్తుందని ఆ సంస్థ వెల్లండించింది. డిసెంబర్ 3 వరకు ఇందుకుగాను బుకింగ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో మరికొన్ని దేశీయ విమానయాన సంస్థలు కూడా ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది.

English summary
IndiGo is offering flights from Coimbatore to Chennai starting at Rs. 1,195 and from Vishakhapatnam to Hyderabad at Rs. 1,259, according to its website.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X