పోలీస్ దంపతుల దారుణ హత్య -ప్రియుడితో కలిసి మైనర్ కూతురి ఘాతుకం -ఊరొదిలి పరార్
పట్టుమని పద్దెనిమిదేళ్లైనా నిండకముందే పక్కదారి పట్టిందా కూతురు. లాక్ డౌన్ దెబ్బకు విద్యా సంస్థలు మూతపడిన తర్వాత అదే పనిగా ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూ టైంపాస్ చేసింది. బుద్ధిగా ఉండాలని చెప్పడంతో తల్లిదండ్రులపై అక్కసు పెంచుకుంది. వెంటపడొద్దని మందలించినందుకు ఆమె ప్రియుడు కూడా కక్షపెంచుకున్నాడు. చివరికి ఇద్దరూ కలిసి ఘాతుకానికి పాల్పడ్డారు..
చిన్నమ్మ శపథం: జనవరి 27 ఆగమనం -శశికళ విడుదల ఖరారు -సుధాకరన్ ఔట్ -ఎన్నికల్లో రచ్చే
కానిస్టేబుల్ దంపతుల హత్య
స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్ (ఎస్ఏఎఫ్) విభాగానికి చెందిన కానిస్టేబుల్, ఆయన భార్యపై మారణాయుధంతో దాడిచేసి హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో గురువారం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ కుమార్తె, ఆమె ప్రియుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కానిస్టేబుల్ జ్యోతి ప్రసాద్ శర్మ (45), భార్య నీలిమ (43) ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తమ ఇంట్లోనే రక్తపు మడుగులో పడి ఉన్నట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది..
ఆమె బయట.. ప్రియుడు లోపల..
కానిస్టేబుల్ దంపతుల హత్యోదంతంపై ఇండోర్ అదనప్పు ఎస్పీ ప్రశాంత్ చౌబే మీడియాకు వివరాలలు తెలిపారు. గురువారం తెల్లవారుజామున జ్యోతి ప్రసాద్ కుమార్తె బయట తిరుగుతుండగా.. ఆ ఇంటిలో నుంచి పెద్ద అరుపులు, శబ్దాలు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు గుర్తించారని పేర్కొన్నారు. ఇరుగు పొరుగువారు, ఆ ఇంటికి సమీపంలో ఉండే జ్యోతి ప్రసాద్ తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆమెను అడిగితే అమ్మానాన్న గొడవ పడుతున్నారని చెప్పిందని అన్నారు. అయితే ఆ సమయంలో ఇంటి లోపల ప్రియుడు హత్యలకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
పిరుదులపై ప్రేమ ప్రాణం తీసింది -లైవ్లో చూసి షాక్ -సర్జరీ వికటించి ప్రముఖ మోడల్ మృతి
Recommended Video
ఊరొదిలి పరార్..
జంట హత్యలు తర్వాత జ్యోతి ప్రసాద్ కుమార్తె, ఆమె ప్రియుడు కనిపించకుండాపోయారని, ఈ హత్యలో వారిపైనే అనుమానం ఉందని ఏఎస్పీ చౌబే అన్నారు. అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. నెల రోజుల కిందట జ్యోతి ప్రసాద్కు, కుమార్తె ప్రియుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, తమ కుమార్తె వెంటపడొద్దని దంపతులు యువకుణ్ని మందలించారని, అంతలోనే ఈ ఘాతుకం జరిగిందని ఏఎస్పీ తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాలకు పోస్ట్మార్టం చేయించి, బంధువులకు అప్పగించి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.