23 రోజుల్లోనే రేపిస్ట్కు ఉరిశిక్ష: ఇండోర్ కోర్టు సంచలన తీర్పు
ఇండోర్: నాలుగు మాసాల పసిసాపపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కేసు నమోదైన 23 రోజుల్లోనే ఉరిశిక్షను విధించింది. దేశంలోనే అత్యంత త్వరగా తీర్చిచ్చిన కేసుగా ఈ కేసు రికార్డులకెక్కింది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గత నెలలో నాలుగు నెలల పసిపాపను అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకొంది.ఈ కేసులో సునీల్ భీల్(21) అనే వ్యక్తికి శనివారం జిల్లా కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.
దేశంలోనే అతి వేగవంతమైన తీర్పును ఇండోర్ జిల్లా కోర్టు రికార్డు సృష్టించింది. పసిగుడ్డుపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డ ఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు సంచలన తీర్పు ఇచ్చింది. కేసు నమోదైన కేవలం 23 రోజుల్లోనే ముద్దాయికి మరణ శిక్షను విధించింది.
ఇండోర్ నగరంలోని రాజ్వాడా ఫోర్ట్ సమీపంలో తల్లిపక్కనే నిద్రిస్తున్న నాలుగు నెలల పసికందును ఎత్తుకెళ్లిన సునీల్ అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. . సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఏప్రిల్ 21న సునీల్ను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణను పూర్తి చేసి నిందితుడికి శనివారం నాడు శిక్షను విధించారు.