వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండస్ట్రియల్ పాలసీలో దేశానికే ఆదర్శం.. తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి : కేటీఆర్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : తెలంగాణ అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి సాధిస్తోందని అన్నారు మంత్రి కేటీఆర్. ఐదేళ్ల కిందట టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. దీని ద్వారా ఇప్పటికే 11 వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఆ మేరకు 8 వేలకు పైగా ఇండస్ట్రీల్లో దాదాపు 12 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించిందని చెప్పారు. ఢిల్లీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ఇండియా ఎకనామిక్ సమ్మిట్‌లో పాల్గొన్నారు కేటీఆర్.

తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి

తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి

గత ఐదేళ్లుగా తెలంగాణ అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి సాధించిందని చెప్పుకొచ్చారు కేటీఆర్. మేఘాలయ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన యూనియన్ ఆఫ్ స్టేట్స్ సెషన్‌లో ఆర్థిక ప్రగతి సాధించేందుకు దోహద పడే కేంద్ర రాష్ట్రాల సంబంధాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రొగ్రెసివ్ లీడర్ షిప్ ద్వారా రాష్ట్రాలు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడుతుందని.. ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రం పెద్ద ఉదాహరణ అని వెల్లడించారు.

హుజుర్‌నగర్ బరి.. ఫైనల్‌గా పోటీలో వీళ్లే.. ఇక ఆ లెక్క తేలాలిగా..!హుజుర్‌నగర్ బరి.. ఫైనల్‌గా పోటీలో వీళ్లే.. ఇక ఆ లెక్క తేలాలిగా..!

 టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా అనుమతులు ఈజీ

టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా అనుమతులు ఈజీ


ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తొలుత టీఎస్ ఐపాస్ చట్టం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులు ఇవ్వడం ద్వారా పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందని వివరించారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలు పెరిగినట్లు తెలిపారు. ఆ నేపథ్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు.

ఎకానమిక్ విజన్ కోసం కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలి

ఎకానమిక్ విజన్ కోసం కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలి

అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకెళ్లినప్పుడే అభివృద్ది సాధ్యమవుతుందన్నారు కేటీఆర్. ముక్యంగా ఎకనామిక్ విజన్ కోసం పనిచేసినప్పుడే దేశ ఆర్థిక ప్రగతి వేగవంతం అవుతుందని తెలిపారు. అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే ఆర్థిక అభివృద్ధి మరింత స్పీడప్ అవుతుందన్న కేటీఆర్.. తెలంగాణలో అధికార వికేంద్రీకరణ స్పూర్తి బలంగా ఉందన్నారు. అందుకే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పది జిల్లాల నుంచి 33 జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా అనేక గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామని తెలిపారు.

కన్నతండ్రిపై పోలీసులకు 8 ఏళ్ల బాలుడి ఫిర్యాదు.. ఇంతకు ఏం జరిగిందంటే..!కన్నతండ్రిపై పోలీసులకు 8 ఏళ్ల బాలుడి ఫిర్యాదు.. ఇంతకు ఏం జరిగిందంటే..!

ఆ విషయంలో కేంద్రం నిబంధనలు సడలిస్తే బాగుండు..!

పట్టణల్లో మౌలిక వసతులు కల్పించడానికి పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు కేటీఆర్. అయితే కేంద్ర ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో స్వేచ్ఛగా ఆయా సంస్థలు రాష్ట్రాల్లోకి వచ్చే పరిస్థితులు లేవన్నారు. ఇలాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సాయం అందించాలని ఆకాంక్షించారు. ఈ అంశంలో కేంద్రం నిబంధనలు సడలించి ఆయా రాష్ట్రాలకు సహాయకారిగా నిలవాలని కోరారు. అదలావుంటే ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.

English summary
Telangana is making excellent industrial progress, said Minister KTR. Five years ago, the TRS government introduced the revolutionary TS iPASS Act. It has already given licenses to over 11,000 industries. About 12 lakh people have been directly employed in over 8,000 industries. KTR participated in the India Economic Summit organized by the World Economic Forum in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X