వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వచ్ఛమైన గాలి మా హక్కు: సుప్రీంకు శిశువులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే హక్కును తమకు కల్పించమంటూ ముగ్గురు శిశువులు తొలిసారిగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఈ హక్కు తమకుందని పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన ఆరు నెలల పసివాళ్లు అర్జున గోపాల్, ఆరవ్ భండారి, మరో 14 నెలల జోయా రావ్ అనే వారి పేర్ల మీద సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశాన్ని తమకు కల్పించాలని వారు కోరారు.

 Infants approach Supreme Court seeking ban on firecrackers

'మా ఊపిరితిత్తులు ఇంకా పూర్తిగా వికసించలేదు. క్రాకర్స్(టపాసులు) పేల్చడం ద్వారా కలుషితమైన గాలిని మేం పీల్చలేం.. మమ్మల్ని కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రాబోయే దసరా, దీపావళి సందర్భంగా పేల్చబోయే, కాల్చబోయే మందుగుండు సామగ్రి వల్ల ఢిల్లీలోని గాలి మరింత కలుషితం కానుంది' అని పిటిషన్‌లో పేర్కొన్నారు.దీనిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే రాజ్యాంగం ప్రకారం మైనార్టీ తీరని పిల్లలు తమ హక్కుల కోసం తల్లిదండ్రులు, సంరక్షకుల ద్వారా కోర్టులను ఆశ్రయించవచ్చు. న్యాయవాదులైన తమ తండ్రుల ద్వారా ముగ్గురు శిశువులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

English summary
Three infants from New Delhi, below the age of 15 months, have approached the Supreme Court pleading to stop the sale of firecrackers this Dussehra and Diwali as they do not wish to grow up in a polluted environment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X