బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus Patient:బెంగళూరులో ఇన్ఫోసిస్ భవనం ఖాళీ, ఉద్యోగుల క్షేమం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (కోవిడ్ 19) దెబ్బతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ బెంగళూరులోని తన కార్యాలయాన్ని ఖాళీ చేసింది. కరోనా వైరస్ వ్యాధి కంపెనీ ఉద్యోగులకు సోకకుండా ముందస్తు చర్యలో భాగంగా తమ భవన్నాన్ని ఖాళీ చేశామని ఇన్ఫోసిస్ సంస్థ వివరించింది. ఇప్పటికే ఇన్ఫోసిస్ కంపెనీలోని కొందరిని కరోనా వైరస్ వ్యాధి సోకిందని అనుమానం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఇన్ఫోసిస్ బెంగళూరు డెవలప్ మెంట్ సెంటర్ హెడ్ గురురాజ్ దేశ్ పాండే స్పష్టం చేశారు.

Coronavirus:కరోనా... కరోనా.... కరోనా.... రూ. 20 కరోనా, వైరల్ వీడియో, బ్లాక్ మార్కెట్, భారీ డిమాండ్ !Coronavirus:కరోనా... కరోనా.... కరోనా.... రూ. 20 కరోనా, వైరల్ వీడియో, బ్లాక్ మార్కెట్, భారీ డిమాండ్ !

ఇన్ఫోసిస్ ఉద్యోగికి కరోనా!

ఇన్ఫోసిస్ ఉద్యోగికి కరోనా!

ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ వ్యాధి సోకిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ లోని కొందరు ఉద్యోగులకు కరోనా వైరస్ వ్యాధి సోకిందని అనుమానాలు కలిగాయని ఆ కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఇలాంటి సమయంలో బెంగళూరులోని తన కార్యాలయాన్ని ఖాళీ చెయ్యాలని ఇన్ఫోసిస్ కంపెనీ ప్రతినిధులు నిర్ణయించారు.

ఉద్యోగుల క్షేమం ముఖ్యం

ఉద్యోగుల క్షేమం ముఖ్యం

కంపెనీ ఉద్యోగికి కరోనా వైరస్ వ్యాధి సోకడంతో ముందస్తుగా ఈ చర్యలు తీసుకుంటున్నామని, అందుకే తమ భవనం ఖాళీ చేయించామని ఇన్ఫోసిస్ బెంగళూరు డెవలప్ మెంట్ సెంటర్ హెడ్ గురురాజ్ దేశ్ పాండే పేర్కొన్నారు. కంపెనీ ఉద్యోగులకు కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా కార్యాలయం మొత్తం శుభ్రం చెయ్యడానికి ఇలాంటి చర్యలు తీసుకున్నామని గురురాజ్ దేశ్ పాండ్ వివరించారు.

కంపెనీ ఉద్యోగులు నమ్మండి

కంపెనీ ఉద్యోగులు నమ్మండి

కార్యాలయం మొత్తం శుభ్రం చేసి మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తున్నామని, దయచేసి పుకార్లు నమ్మరాదని, అనవసరంగా సోషల్ మీడియాలో అవాస్తవాలు పుకార్లుగా పుట్టిస్తున్నారని, వాటిని మీరు నమ్మకండి అని ఇన్ణోసిస్ బెంగళూరు డెవలప్ మెంట్ హెడ్ గురురాజ్ దేశ్ పాండ్ మనవి చేశారు.

కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు!

కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు!

పుకార్లు నమ్మి వాటిని మీరు మరింత ప్రచారం చెయ్యరాదని ఉద్యోగులకు గురురాజ్ దేశ్ పాండ్ మనవి చేశారు. కరోనా వైరస్ కు అందరూ దూరంగా ఉండటానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు, బయోటెక్ కంపెనీలను ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఇన్ఫోసిస్ బెంగళూరు డెవలప్ మెంట్ సెంటర్ హెడ్ గురురాజ్ దేశ్ పాండ్ వివరించారు.

English summary
The Infosys in Bengaluru has evacuated one of its satellite office buildings following reports of its employee coming in contact with a suspected coronavirus patient.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X