ఇన్ఫోసిస్లో వేతన పెంపు అంతే, అదే దారిలో విప్రో
ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఇన్ఫోసిస్ వేతన పెంపును క్వార్టర్ పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం వేతన పెంపును కంపెనీ ఈ నెల నుంచి చేపట్టింది.
ముంబై: ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఇన్ఫోసిస్ వేతన పెంపును క్వార్టర్ పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం వేతన పెంపును కంపెనీ ఈ నెల నుంచి చేపట్టింది.
సగటున ఉద్యోగికి 5 శాతం మాత్రమే పెంపును చేపట్టింది. బాగా పని చేసిన వారికి 12 శాతం వరకు ఇస్తుంది. విప్రో కూడా ఇదే మేర పెంపును చేపడుతున్నట్లుగా వెల్లడైంది.
జాబ్ లెవల్ 6 ఉద్యోగుల, అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగుల సమీక్షించిన వేతన పరిహారాలు జూలై నుంచి అమలులోకి వస్తున్నాయి. సాధారణంగా ఏప్రిల్ నెలలో కంపెనీ ఇంక్రిమెంట్లు చేపడుతుంది.
కానీ ఈసారి పరిశ్రమలో నెలకొన్న ఒత్తిళ్ల నేపథ్యంలో క్వార్టర్ కాలం ఇంక్రిమెంట్లను వాయిదా వేసింది. ఈ ఇంక్రిమెంట్లు గత ఏడాది కంటే తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
Recommended Video
గత ఏడాది 6-12 శాతం మధ్యలో ఇంక్రిమెంట్లు ఇచ్చింది. సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు అసలు కంపెనీ ఇంక్రిమెంట్లనే చేపట్టడం లేదని అంటున్నారు.
కొత్త పని తీరు నిర్వహణ, వ్యవస్థ అకౌంట్ ద్వారా వ్యక్తిగతంగా ఓ ఉద్యోగి సహకారం ఏ మేరక ఉంటుందో తెలుసుకోవడం కోసం కంపెనీ ఎక్కువ దృష్టి సారించింది. ఫీడ్ బ్యాకులను కూడా కంపెనీ నిత్యం తీసుకుంటోంది. కంపెనీలో మంచి ప్రతిభ కనబర్చిన వారికి 10 నుంచి 12 శాతం మధ్యలో ఉండనున్నాయి.