వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమించి పెళ్ళిచేసుకొన్నారని నగ్నంగా ఊరేగించారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

భోపాల్ :సమాజం రోజులు మారుతున్నాయి. అనేక కొత్త కొత్త విషయాలను మానవుడు కనుగొంటున్నాడు , కాని సాటి మనిషి అనే మానవత్వాన్ని మరిచిపోతున్నాడు. జాలి, దయ, కరుణ చూపేందుకు కూడ వెనుకాడుతున్నారు. ప్రేమించుకొన్న పాపానికి ప్రేమికుల జంటను నగ్నంగా ఊరేగించారు. సభ్యసమాజం సిగ్గుపడే ఈ సంఘటన మద్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

మద్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్తాం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకొంది.మానవత్వం మంటగలిపేలా ప్రేమజంట ఇరు కుటుంబాలు వ్యవహారించారు..రత్తాం జిల్లా మెగలిఖేడాలో పదిహేను రోజుల క్రితం ఓ ప్రేమ జంట వివాహం చేసుకొంది. ఈ వివాహన్ని రెండు వైపులా కుటుంబాలు మూర్ఖంగా వ్యవహారించారు.

inhuman incident happened in madhyapradesh

ఈ ప్రేమను రెండు కుటుంబాలు వ్యతిరేకించారు.ఇరు కుటుంబాల పెద్దలు ప్రేమ జంటను బంధించారు. ఆ ప్రేమ జంటను చిత్రహింసలు పెట్టారు.పారిపోకుండా వారిని వేర్వేరుగా తాళ్ళతో కట్టేశారు.అంతటితో వారిలో కసి తీరలేదు.ప్రేమ జంటను నగ్నంగా గ్రామంలో ఊరేగించారు.

ప్రేమ జంటను చిత్రహింసలు పెట్టి గ్రామంలో నగ్నంగా ఊరేగించిన ఘటనను కొందరు చిత్రీకరించి సామాజిక మాద్యమంలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ గా మారింది.ఈ వీడియో ఆదారంగా పోలీసులు గ్రామానికి చేరుకొని యువతిని రక్షించారు. అయితే యువకుడి ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
shameful incident in rattam dist in madhya pradesh state .lovers marriage 15 days back. both of family members were oppose marriage.two family members attack on lovers.and also naked both of them walk in the village.someone record this incident post on Facebook.police protect the lady, young man disappear.police investigate case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X