ప్రేమించి పెళ్ళిచేసుకొన్నారని నగ్నంగా ఊరేగించారు
భోపాల్ :సమాజం రోజులు మారుతున్నాయి. అనేక కొత్త కొత్త విషయాలను మానవుడు కనుగొంటున్నాడు , కాని సాటి మనిషి అనే మానవత్వాన్ని మరిచిపోతున్నాడు. జాలి, దయ, కరుణ చూపేందుకు కూడ వెనుకాడుతున్నారు. ప్రేమించుకొన్న పాపానికి ప్రేమికుల జంటను నగ్నంగా ఊరేగించారు. సభ్యసమాజం సిగ్గుపడే ఈ సంఘటన మద్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
మద్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్తాం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకొంది.మానవత్వం మంటగలిపేలా ప్రేమజంట ఇరు కుటుంబాలు వ్యవహారించారు..రత్తాం జిల్లా మెగలిఖేడాలో పదిహేను రోజుల క్రితం ఓ ప్రేమ జంట వివాహం చేసుకొంది. ఈ వివాహన్ని రెండు వైపులా కుటుంబాలు మూర్ఖంగా వ్యవహారించారు.
ఈ ప్రేమను రెండు కుటుంబాలు వ్యతిరేకించారు.ఇరు కుటుంబాల పెద్దలు ప్రేమ జంటను బంధించారు. ఆ ప్రేమ జంటను చిత్రహింసలు పెట్టారు.పారిపోకుండా వారిని వేర్వేరుగా తాళ్ళతో కట్టేశారు.అంతటితో వారిలో కసి తీరలేదు.ప్రేమ జంటను నగ్నంగా గ్రామంలో ఊరేగించారు.
ప్రేమ జంటను చిత్రహింసలు పెట్టి గ్రామంలో నగ్నంగా ఊరేగించిన ఘటనను కొందరు చిత్రీకరించి సామాజిక మాద్యమంలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ గా మారింది.ఈ వీడియో ఆదారంగా పోలీసులు గ్రామానికి చేరుకొని యువతిని రక్షించారు. అయితే యువకుడి ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.