వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీపార్టీ నేత ముఖంపై ఇంక్ దాడి, ఇవి తప్పవని వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేత యోగేంద్ర యాదవ్ ముఖం పైన ఓ వ్యక్తి సిరా చల్లాడు. శనివారం ఎఎపి నిర్వహించిన సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. సభకు హాజరైన యోగేంద్ర మీడియాతో మాట్లాడుతుండగా, వెనుక నుంచి ఓ గుర్తు తెలియన వ్యక్తి వచ్చి యాదవ్ ముఖంపై ఒక్కసారిగా సిరా పోశాడు.

ఆ తర్వాత వెంటనే భారత్ మాతాకీ జై అంటూ నినదించాడు. ఈ ఘటనతో అక్కడున్న పార్టీ కార్యకర్తలు కోపోద్రిక్తులయ్యారు. ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. పరిస్థితి మరింత అదుపు తప్పకముందే పోలీసులు జోక్యం చేసుకుని, అతన్ని అక్కడి నుంచి తరలించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం జంతర్ మంతర్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఎఎపి టోపీ, బ్యాడ్జీ ధరించిన ఆ యువకుడు ముఖంపై సిరా పోశాడు. అతడిని పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు పోలీసులు తరలించారు. షాలిమార్ బాగ్‌కు చెందిన సాగర్‌గా గుర్తించారు.

 Ink attack: Man smears ink on AAP leader Yogendra Yadav's face

కాగా, హర్యానాలోని గుర్గావ్ నుంచి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎఎపి తరఫున యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. మీతో మాట్లాడుతున్నప్పుడు వెనుక నుంచి వచ్చి ఆ వ్యక్తి నా ముఖంపై సిరా పోశాడని, తాను అతన్ని చూడలేదని, ఈ దేశంలో శక్తివంతులపై పోరాడుతున్నప్పుడు దానికి కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, వ్యాఖ్యానించారు. ఏమైనప్పటికీ తనపై దాడి చేసిన ఆ వ్యక్తిని భగవంతుడు క్షమించాలని కోరుకున్నారు.

English summary
Aam Aadmi Party (AAP) leader Yogendra Yadav today was attacked by ink while he was at an event in Jantar Mantar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X