ఓ టీవీ యాంకర్ ప్రశ్న... సర్జికల్ దాడులకు కారణమైంది: పారికర్
ఓ టీవీ యాంకర్ అడిగిన అవమానకర ప్రశ్నే.. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ దాడులు చేసేందుకు కారణమైందట. ఈ విషయాన్ని మాజీ రక్షణ మంత్రి, గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్
పనాజీ: ఓ టీవీ యాంకర్ అడిగిన అవమానకర ప్రశ్నే.. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ దాడులు చేసేందుకు నాంది పలికిందని మాజీ రక్షణ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు.
నాకిక ఓపిక లేదు, మొహమాటం అంతకన్నా లేదు: ఉత్తర కొరియాపై ట్రంప్
గోవాలో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. గతేడాది భారత్ చేపట్టిన సర్జికల్ దాడుల గురించి ప్రస్తావించారు. ఆ దాడులపై 15 నెలల ముందు నుంచే ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
2015 జూన్ 4న మణిపూర్లోని చందెల్ జిల్లాలో భారత జవాన్ల కాన్వాయ్పై మిలిటెంట్లు దాడి చేశారు. ఆ ఘటనలో 18 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసి తాను చాలా బాధపడినట్లు పారికర్ వెల్లడించారు.
కనీసం 200 మంది కూడా లేని ఓ చిన్న ఉగ్రవాద సంస్థ 18 మంది భారత జవాన్ల ప్రాణం తీసిందని తెలిసి తనకు అవమానంగా అనిపించిందని, దీంతో ఉగ్రవాదులకు దీటుగా బదులివ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
సైన్యంతో సమావేశమై.. అదే ఏడాది జూన్ 8న భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి.. 70 నుంచి 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పారికర్ తెలిపారు.
ఆ దాడులు విజయవంతమైన తర్వాత కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ను ఓ విలేకరి ప్రశ్నించారని, 'ఇలాంటి దాడులనే పశ్చిమ సరిహద్దుల్లోనూ చేసే ధైర్యం, సామర్థ్యం మీకున్నాయా? అని ఆ విలేకరి అడిగారని చెప్పారు.
పశ్చిమ సరిహద్దులంటే పాకిస్తాన్తోనేనని, ఆ ప్రశ్న వినగానే తనకు చాలా అవమానకరంగా అన్పించిందని. ఆ మరుసటి రోజు నుంచే సర్జికల్ దాడులకు ప్రణాళిక రూపొందించామని, అలా 2016 సెప్టెంబర్ 29న పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ దాడులు చేపట్టామని పారికర్ పేర్కొన్నారు.