వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ టీవీ యాంకర్ ప్రశ్న... సర్జికల్ దాడులకు కారణమైంది: పారికర్

ఓ టీవీ యాంకర్‌ అడిగిన అవమానకర ప్రశ్నే.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్‌ దాడులు చేసేందుకు కారణమైందట. ఈ విషయాన్ని మాజీ రక్షణ మంత్రి, గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

పనాజీ: ఓ టీవీ యాంకర్‌ అడిగిన అవమానకర ప్రశ్నే.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్‌ దాడులు చేసేందుకు నాంది పలికిందని మాజీ రక్షణ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అన్నారు.

నాకిక ఓపిక లేదు, మొహమాటం అంతకన్నా లేదు: ఉత్తర కొరియాపై ట్రంప్నాకిక ఓపిక లేదు, మొహమాటం అంతకన్నా లేదు: ఉత్తర కొరియాపై ట్రంప్

గోవాలో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. గతేడాది భారత్‌ చేపట్టిన సర్జికల్‌ దాడుల గురించి ప్రస్తావించారు. ఆ దాడులపై 15 నెలల ముందు నుంచే ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

Insulting question by TV anchor led to planning of PoK surgical strikes, says Manohar Parrikar

2015 జూన్‌ 4న మణిపూర్‌లోని చందెల్‌ జిల్లాలో భారత జవాన్ల కాన్వాయ్‌పై మిలిటెంట్లు దాడి చేశారు. ఆ ఘటనలో 18 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసి తాను చాలా బాధపడినట్లు పారికర్ వెల్లడించారు.

కనీసం 200 మంది కూడా లేని ఓ చిన్న ఉగ్రవాద సంస్థ 18 మంది భారత జవాన్ల ప్రాణం తీసిందని తెలిసి తనకు అవమానంగా అనిపించిందని, దీంతో ఉగ్రవాదులకు దీటుగా బదులివ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

సైన్యంతో సమావేశమై.. అదే ఏడాది జూన్‌ 8న భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి.. 70 నుంచి 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పారికర్‌ తెలిపారు.

ఆ దాడులు విజయవంతమైన తర్వాత కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ను ఓ విలేకరి ప్రశ్నించారని, 'ఇలాంటి దాడులనే పశ్చిమ సరిహద్దుల్లోనూ చేసే ధైర్యం, సామర్థ్యం మీకున్నాయా? అని ఆ విలేకరి అడిగారని చెప్పారు.

పశ్చిమ సరిహద్దులంటే పాకిస్తాన్‌తోనేనని, ఆ ప్రశ్న వినగానే తనకు చాలా అవమానకరంగా అన్పించిందని. ఆ మరుసటి రోజు నుంచే సర్జికల్‌ దాడులకు ప్రణాళిక రూపొందించామని, అలా 2016 సెప్టెంబర్‌ 29న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్‌ దాడులు చేపట్టామని పారికర్‌ పేర్కొన్నారు.

English summary
Former defence minister Manohar Parrikar on Friday said an “insulting” question by a television anchor to Rajyavardhan Singh Rathore after the 2015 anti-insurgency operation along the Myanmar border prompted him to plan last year’s ‘surgical strikes’ in PoK. Speaking before a gathering of industrialists in Panaji, the Goa Chief Minister said, “The surgical strikes against militants in PoK (Pakistan Occupied Kashmir) was planned 15 months in advance.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X