కశ్మీర్లో మెరుగుపడుతున్న సిచుయేషన్.. ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడ్డాయి. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనుండగా .. ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. మరోవైపు ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులు పునరుద్ధరించారు. పరిస్థితిని బట్టి మిగతా జిల్లాల్లో కూడా ఆంక్షలను సడలిస్తామని కశ్మీర్ ప్రభుత్వ వర్గాలు శనివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత 13వ రోజు పరిస్థితులు క్రమంగా మెరుగుపడ్డాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. సోమవారం నుంచి స్కూళ్లు పనిచేస్తాయి. మరోవైపు కమ్యునికేషన్ వ్యవస్థను క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. ఇవాళ ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధించారు. మిగతా జిల్లాల్లో కూడా పరిస్థితిని బట్టి ఆంక్షలను సడలిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కశ్మీర్లో 24 జిల్లాలు ఉండగా .. ఇప్పటికే 12 జిల్లాల్లో పరిస్థితి అదుపులో ఉందని భద్రతా బలగాలు తెలిపాయి. 12 జిల్లాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. పరిస్థితిని బట్టి క్రమంగా ఆంక్షలను ఎత్తివేస్తున్నారు. మరో వారంలో పరిస్థితి యాధాస్థితికి వస్తోందని అధికారులు చెప్తున్నారు.