కలవాలని వేధింపు: ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఆమెని పొడిచి చంపాడు
ముంబై: తనను కలిసేందుకు నిరాకరిస్తోందని, అలాగే తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని... నలభై ఏళ్ల ఓ వ్యక్తి పెళ్లైన తన మహిళా సహోద్యోగిని (30) దారుణంగా పొడిచి చంపిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం వెల్లడించారు. ఇది ఆదివారం జరిగింది.
రామ్ నారాయణ్ (40) బాధితురాలి పైన దాడి చేశాడు. ఆమె పని అనంతరం ఖుప్రీ గ్రామంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో అతను దాడి చేశాడని వాడా పోలీసు స్టేషన్కు చెందిన పోలీస్ సంజయ్ హజారే చెప్పారు.
ఆమెను పలుమార్లు కత్తితో పొడిచాడని చెప్పారు. దీంతో ఆమె సంఘటన స్థలంలోనే మృతి చెందిందని, అనంతరం అతను పారిపోయాడని చెప్పారు. ఇరువురు కూడా వాడాలోని ఓ కంపెనీలో పని చేస్తున్నారని చెప్పారు.
అతను నిత్యం ఆమెకు ఫోన్ చేసేవాడు. పని అయిపోయిన తర్వాత తనను కలవాలని డిమాండ్ చేసేవాడు. అయితే, దానిని ఆమె పట్టించుకోకపోయేది. ఈ విషయాన్ని ఆమె ఓసారి తన భర్తకు కూడా చెప్పింది. దీంతో భర్త వచ్చి నిందితుడ్ని హెచ్చరించాడు. దీంతో ఆ నిందితుడు రెచ్చిపోయి ఆమెను హత్య చేశాడు.