వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం: వాసన వస్తోందన్నందుకు చంపేశాడు

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 'నీ శరీరం నుంచి దుర్వాసన వస్తుంది' అంటూ తరచూ చెప్తున్న మహిళను ఆమె ప్రియుడు గొంతునులిమి చంపేశాడు. ఈ ఘటన పాట్నాలోని బిషున్‌పూర్‌లో జరిగింది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2006లో వివాహమైన నిభా(25).. తన భర్త నుంచి విడిపోయి తన ప్రియుడు భోలాతో సహజీవనం చేస్తోంది. ఆమెకు ఏడేళ్ల కూతురు కూడా ఉంది. కాగా, 'నీ శరీరం నుంచి దుర్వాసన వస్తోంది' అని భోలాకు తరచూ నిభా చెప్తుండేది.

Irked over lover's complaint of bad body odour, paramour kills woman

ఈ విషయంపై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. 'నీ నుంచి వచ్చే కంపు భరించలేక పోతున్నా' అంటూ తరచూ చెబుతుండటంతో ఆగ్రహానికి గురైన భోలా శనివారం ఆమె గొంతు నులుమి చంపి మంచంపై పడేసి పరారయ్యాడు.

కాగా, ఆ గదిలో నుంచి మృతదేహం వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు గది తలుపు పగులగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు భోలాను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు తెలిపారు.

English summary
A woman, mother of 7-year-old kid, was allegedly killed by paramour after she repeatedly complained him of bad body odour, said police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X