10 మార్గాలు.. భారత్ కరోనా సంక్షోభం గట్టెక్కాలంటే.. ఇవి చేసి తీరాల్సిందే..!
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దేశ జీడీపీ వృద్దిరేటు 1.9శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన నాటి నుంచి భారత్ ఇంత తక్కువ వృద్ధిరేటు కనబర్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. నిజానికి 2021లో భారత జీడీపీ 7.4శాతం మేర వృద్ది చెందుతుందని అంచనా వేశారు. కానీ కరోనా ఎఫెక్ట్తో పరిస్థితి తలకిందులైంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెందిన 50 మంది ఐఆర్ఎస్ ఆఫీసర్స్ రంగంలోకి దిగారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడానికి 10 కీలక సలహాలు,సూచనలు చేశారు.
Taxing the wealthy:
సంపన్నులైన ‘సూపర్ రిచ్' వర్గంపై పన్నులను మరింత పెంచాలని ఐఆర్ఎస్ టీమ్ కేంద్రానికి ప్రతిపాదించింది. ఇటీవలి కేంద్ర బడ్జెట్ 2020-21లో సంపన్నులపై సర్చార్జిలను పెంచినప్పటికీ.. దాని ద్వారా కేవలం రూ.2700 కోట్లు మాత్రమే వసూలు అవుతాయని అంచనా వేస్తున్నారు. కాబట్టి అధిక ఆదాయం కోసం మరో రెండు ప్రత్యామ్నాయాలను సూచించారు. ఈ రెండింటినీ పరిమిత, నిర్ణీత కాలానికి విధించవచ్చు. ఇందులో 1). రూ.1కోటి ఆదాయం ఉన్నవారు ప్రస్తుతం 30శాతం ట్యాక్స్ స్లాబ్లో కొనసాగుతున్నారు. ఈ స్లాబ్ను ఇకపై 40శాతానికి పెంచడం. 2). రూ.5కోట్లు పైబడి ఆదాయం ఉన్నవారి కోసం కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం.
Tax India income of foreign companies:
భారత్లోని తమ బ్రాంచ్లు లేదా శాశ్వత కార్యాలయాల ద్వారా ఆదాయాన్ని గడిస్తున్న విదేశీ కంపెనీలపై సర్చార్జిని పెంచాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం రూ.1కోటి నుంచి రూ.10కోట్లు ఆదాయం గడిస్తున్న విదేవీ కంపెనీలపై 2శాతం సర్చార్జి వసూలు చేస్తున్నట్టు చెప్పారు. రూ.10కోట్లు ఆదాయం గడిస్తున్న విదేశీ కంపెనీలపై 5శాతం సర్చార్జి వసూలు చేస్తున్నామన్నారు. అయితే చాలాకాలంగా ఈ సర్చార్జిలను సమీక్షించలేదని.. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముందని చెప్పారు.
COVID relief cess:
ప్రతీ
పన్ను
చెల్లింపుదారుడిపై
కోవిడ్-19
రిలీఫ్
సెజ్
విధించడం
ద్వారా
అదనపు
ఆదాయాన్ని
సమకూర్చుకోవచ్చని
ప్రతిపాదించారు.
ప్రస్తుతం
ప్రతీ
పన్ను
చెల్లింపుదారుడిపై
ప్రభుత్వం
2శాతం
విద్య,ఆరోగ్య
సెజ్ను
వసూలు
చేస్తుందన్నారు.
మూలధన
పెట్టుబడిని
పెంచేందుకు..
ప్రతీ
పన్ను
చెల్లింపుదారుడిపై
అదనంగా
4శాతం
వన్
టైమ్
కోవిడ్-19
రిలీఫ్
సెజ్ను
విధించాలన్నారు.
తద్వారా
రూ.15వేల
కోట్లు
నుంచి
రూ.18వేల
కోట్లు
ఆదాయం
సమకూరే
అవకాశం
ఉన్నట్టు
అంచనా
వేశారు.
ఒకవేళ
మధ్య
తరగతిపై
భారాన్ని
తగ్గించాలనుకుంటే..
రూ.10లక్షలు
పైబడి
ఆదాయం
ఉన్న
ట్యాక్స్
పేయర్స్
పైనే
ఈ
సెజ్
విధించాలన్నారు.
Mobilisation of CSR funds for COVID relief:
ఈ జాతీయ విపత్తు సమయంలో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) పరిధిలోని యాక్టివిటీస్ను మరింత విస్తృతం చేయాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం కరోనా వైరస్ సంబంధిత రిలీఫ్ చర్యల్లో పాలుపంచుకునే కార్పోరేట్ కంపెనీలకు సెక్షన్ 37 కింద ఆ ఖర్చును 2021 ఆర్థిక సంవత్సరానికి క్లెయిమ్ చేసుకోవడానికి అనుమతించబడుతుంది. తద్వారా కరోనా నివారణ చర్యల కోసం అవసరమైన ఫండ్ సమకూరుతుందన్నారు.
coronavirus savings certificates
కరోనావైరస్ రిలీఫ్ కోసం నిధులను సమీకరించడానికి కొత్త పన్ను పొదుపు పథకాన్ని రూపొందించాలని అధికారులు సూచించారు. ఇందులో u/s 80C కింద వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు (HUF లు) రూ .2.5 లక్షల వరకు పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. ఈ మొత్తానికి ఐదేళ్ల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. వీటిపై ప్రభుత్వం అధిక వడ్డీ ఇస్తే ఎక్కువమంది పెట్టుబడికి ముందుకొస్తారు.
New amnesty scheme
వివాద్ సే విశ్వాస్ 2020 స్కీమ్ కేవలం వివాదాల్లో ఉన్న డిమాండ్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఆదాయం సమకూర్చుకోవడానికి I-T చట్టం వడ్డీ u/s 220 (2)ని కొంత లేదా పూర్తిగా వదులుకునే రుణమాఫీ పథకాన్ని ప్రతిపాదించారు. వివాదరహిత కేసుల్లోనూ పెండింగ్లో ఉన్న జరిమానా చెల్లింపులకు కూడా ఇలాంటి పథకాన్ని వర్తింపజేయడం ద్వారా ఆ సొమ్ము ప్రభుత్వానికి చేరే అవకాశం ఉందన్నారు.
Raise capital gains to 10% on overseas Indian citizens:
OCI (ఓవర్సీస్ సిటిజెన్షిప్ ఆఫ్ ఇండియా) పౌరుల వారసత్వ సంపద నుండి వచ్చే మూలధన లాభాలను ప్రస్తుతం ఉన్న 30 శాతం నుంచి మరో 10 శాతం పెంచాలన్నారు. అలాగే స్వల్పకాలిక, దీర్ఘకాలిక లాభాలపై 20 శాతం పన్నును పెంచాలని ప్రతిపాదించారు. వారసత్వ ఆస్తులను కలిగివున్న ఓవర్సీస్ సిటిజెన్స్ ప్రభుత్వం నుంచి చాలావరకు సబ్సిడీలు,ఇతరత్రా ప్రయోజనాలు పొందుతున్నారు కాబట్టి.. వారిపై పన్నును పెంచాలన్నారు.
Google Tax :
‘గూగుల్
టాక్స్'
లేదా
ఈక్వలైజేషన్
లెవీని
ఫైనాన్స్
యాక్ట్,
2016లో
ప్రవేశపెట్టింది.
దీని
ద్వారా
కొన్ని
నాన్-రెసిడెంట్
వ్యాపారాలు,కొన్ని
‘ప్రత్యేక
సేవలపై'
పన్ను
విధిస్తున్నారు.
ఇందులో
ఎక్కువగా
ఆన్లైన్
అడ్వర్టైజ్మెంట్
స్పేస్,సర్వీస్
అందిస్తున్న
సంస్థలు
ఉన్నాయి.
ప్రస్తుతం
వాటి
స్థూల
ఉత్పత్తి,సేవలపై
6శాతం
పన్ను
విధిస్తున్నారు.
ఇటువంటి
ఆదాయాలు
ప్రస్తుతం
స్థూల
ప్రాతిపదికన
6
శాతం
పన్ను
విధించబడుతున్నాయి.బడ్జెట్-2020లో
దీని
పెంపుకు
ప్రతిపాదనలు
చేశారు.
ప్రస్తుత
లాక్
డౌన్
పీరియడ్లో
కార్యకలాపాలు
సాగిస్తున్నది
ఎక్కువగా
డిజిటల్/ఆన్లైన్/ఈకామర్స్,నెట్ఫ్లిక్స్,అమెజాన్
ప్రైమ్,జూమ్
వంటి
సంస్థలే
ఉన్నాయి.
కాబట్టి
వీటిపై
పన్ను
పెంపుపై
దృష్టి
సారించాలని
కోరింది.
ఆన్లైన్
అడ్వర్టైజ్మెంట్
సంస్థలపై
1శాతం
నుంచి
7శాతం
పన్ను
పెంపుకు
అవకాశం
ఉందని
పేర్కొంది.
అలాగే
ఇతరత్రా
ఆన్లైన్
ఈకామర్స్
సంస్థలపై
2శాతం
నుంచి
3శాతానికి
పన్ను
పెంపుకు
అవకాశం
ఉందని
తెలిపింది.
Give It Up campaign
సంపన్నులు
ఎల్పీజీ
సబ్సిడీ
వదులుకోవాలని
ప్రభుత్వం
ఎలాగైతే
'గివ్
ఇట్
అప్'
క్యాంపెయిన్
చేపట్టిందో..
ఇప్పుడు
కూడా
సూపర్
రిచ్
వ్యక్తులను
కనీసం
ఒక
ట్యాక్స్
సబ్సిడీ
నుంచి
తప్పుకునేలా
క్యాంపెయిన్
చేపట్టాలని
అధికారులు
ప్రతిపాదించారు.
ఉదాహరణకు
ఎవరైనా
స్వచ్చందంగా
80C
డిడక్షన్
నుంచి
ఏడాది
పాటు
తప్పుకునేందుకు
సిద్దంగా
ఉంటే..
అలాంటివారిని
ప్రోత్సహించాలని
చెప్పారు.
Reintroduction of the Inheritance Tax:
అభివృద్ధి చెందిన దేశాలలో వారసత్వ పన్ను 55 శాతం వృద్దితో వసూలు చేయబడుతోందని అధికారులు పేర్కొన్నారు. భారత్లో ఇది 1985లో అమలులోకి వచ్చిందన్నారు. ఇందులో 10శాతం నుంచి 85శాతం వరకు స్లాబ్స్ నిర్ణయించారు. దీన్నిపున:ప్రవేశ పెట్టాలని అధికారులు ప్రతిపాదించారు.