వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నయ్య అబద్ధం చెప్పాడా!: విమానంలో ఏం జరిగింది?

|
Google Oneindia TeluguNews

ముంబై/న్యూఢిల్లీ: ముంబై నుంచి పుణెకు బయలుదేరే జెట్‌ ఎయిర్‌వేస్ విమానంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త, టీసీఎస్ ఉద్యోగి ఒకరు తనను హత్య చేసేందుకు ప్రయత్నించాడని, అతనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా, వాస్తవానికి విమానంలో గొడవకు దిగింది కన్నయ్య కుమారేనట. సీటు విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవగానే దీన్ని పరిగణించాలి తప్ప, హత్యాయత్నాలు ఏమీ జరగలేదని తమ ప్రాథమిక విచారణలో తేలినట్టు ముంబై షహర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

Is Kanhaiya Kumar lying? 'It was seat issue' - Policeman reveals what 'really' happened

ఓ ప్రయాణికుడు తనకు కేటాయించిన విండో సీటులో కూర్చునేందుకు ప్రయత్నిస్తూ.. అడ్డుగా ఉన్న కన్నయ్యను తగలడంతో వివాదం జరిగిందని తెలిపారు. ఇద్దరు తోసుకున్నారే తప్ప.. మరేమీ జరగలేదని చెప్పారు.

ఇతర ప్రయాణికులు, విమాన సిబ్బంది సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ఆయన తెలిపారు. అయినప్పటికీ, కన్నయ్య చేసిన ఆరోపణలపై విచారణ కొనసాగించనున్నామని, మరింత మంది నుంచి వాంగ్మూలాలను నమోదు చేస్తామని వివరించారు.

English summary
A major controversy erupted after JNU student leader Kanhaiya Kumar alleged that he was assaulted on a Jet Airways flight to Pune on Sunday morning in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X