సదానందగౌడకు నటి, మోడల్ చిక్కు: వాస్తు దోషమా?
బెంగళూరు: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ఇటీవల ఎదుర్కొంటున్న ఇబ్బందులకు వాస్తు కారణమా? అంటే సదానంద అవుననే భావిస్తున్నారని తెలుస్తోంది. సదానంద గౌడ కేంద్రమంత్రిగా ఉన్నారు. ఢిల్లీలోని ఇంటిలో వాస్తు దోషం కారణంగానే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అనుమానిస్తున్నారని వినికిడి.
సదానంద గౌడకు వాస్తును నమ్ముతారు. గతంలో ఆయన వాస్తును చూసుకొని పని చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తన ఇంటి వాస్తు సరిగా లేకపోవడం వల్లనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.
కాగా, కొద్ది రోజులుగా సదానంద గౌడ, ఆయన తనయుడు కార్తీక్ గౌడ వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. నటి, మోడల్ అయిన మైత్రేయ.. కార్తీక్ గౌడ తనను పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిని పోలీసులు విచారిస్తున్నారు. కార్తీక్ గౌడకు పోలీసులు నోటీసులు పంపించారు. ఇటీవలే ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చింది.