నోబెల్ రేసులో ఐఎస్ఐఎస్ రేప్ బాధితురాలు
నార్వే: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ అత్యాచార బాధితురాలు యాజిదీ నడియా మురాడ్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి రేసులో నిలిచింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బాధితులకు ప్రతినిధిగా నిలిచింది.
యాజిదీ నడియా మురాడ్ తో పాటు పోప్ ఫ్రాన్సిస్, అఫ్ఘనిస్థాన్ మహిళల సైక్లింగ్ టీమ్ తదితరుల పేర్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. 2016 ఏడాదికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనున్న అవార్డులకు పలువురు పోటీలో ఉన్నారు.
ఐదుగురు సభ్యులతో కూడిన నార్వే నోబెల్ కమిటీకి 200 నామినేషన్లు వచ్చాయి. విజేతను ఎంపిక చేసేందుకు మార్చి 29వ తేదిన కమిటీ సమావేశం కానుంది. నార్వేకు చెందిన చట్టసభ సభ్యుడు ఒకరు యాజిదీ నడియా మురాడ్ పేరును ప్రతిపాదించారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల సెక్స్ బానిసత్వం నుంచి తప్పించుకున్న యాజిదీ నడియా మురాడ్ తరువాత ఐఎస్ఐఎస్ బాధితుల ప్రతినిధిగా నిలిచింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ పోప్ ఫ్రాన్సిస్ పేరును, అఫ్ఘనిస్థాన్ మహిళల సైక్లింగ్ టీమ్ ను ఇటలీ చట్టసభ సభ్యులు నామినేట్ చేశారు.