ప్రధాని మోడీకి వెరైటీ ఫ్రెండ్షిప్ డే గ్రీటింగ్స్ తెలిపిన ఇజ్రాయిల్ ప్రధాని...! వీడియో
ఆగస్టు మొదటి ఆదివారం ప్రపంచమంతా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే, అయితే స్నేహితుల దినోత్సవం అంటే వ్యక్తుల మధ్య మాత్రమే ఉత్సవాలు, గ్రీటిగ్స్ జరిగుతాయి,కాని నేడు జరిగుతున్న స్నేహితుల దినోత్సవానికి ఓ ప్రత్యేకత ఉంది. వ్యక్తుల మధ్య గ్రీటింగ్స్ కాకుండా రెండు దేశాల అధినేతలు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అది కూడ ఓ పాత సినిమాలోని స్నేహ బంధాన్ని గుర్తు చేస్తూ పాడిన పాటను సైతం పోస్ట్ చేసుకున్నారు.
స్నేహితుల దినోత్సవ నాడు షోలే సినిమాలోని "హే దోస్త్ హమ్ నహి తోడెంగే " అనే పాటను ఖచ్చితంగా పాడుకోవాల్సిన సమయం. ఇలా ఆ పాట అంతలా ప్రాచుర్యం పోందిన విషయం తెలిసిందే. అయితే నేడు ఇదే పాటను రెండు దేశాల అధినేతలు కూడ పాడుకున్నారు. దేశాల మధ్య స్నేహ బంధం కొనసాగించేందుకు భారత దేశానికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. అయితే గ్రీటింగ్స్ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఇజ్రాయిల్ ఎంబసీ అధికారులు షోలే సినిమాలోనే పాటను రెండు దేశాల అధినేతలైన నరేంద్రమోడీ, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూల ఫోటోలను కలిపి గ్రాఫిక్స్ చేసిన వీడీయోను పోస్ట్ చేశారు.
అనంతంరం ఆ పోస్టును స్వీకరించిన ప్రధాని నరేంద్రమోడీ సైతం ఇజ్రాయిల్కు ఫ్రెండ్షిప్ డే శుభాకంక్షలు తెలిపుతూ రెండు దేశాల మధ్య స్నేహబంధం కొనసాగుతుందని రీ ట్వీట్ చేస్తూ ఆదే వీడీయోను పోస్ట్ చేశారు. రెండు దేశాల మధ్య స్నేహ బంధం ఎప్పటికి వీడీపోదని పేర్కోన్నారు. భారత ఎన్నికల్లో భాగంగా రెండవ సారి ప్రధానిగా ఎన్నికైన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచదేశాల కంటే మొదటగా అభినందనలు తెలిపాడు.