వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 45
శ్రీహరికోట : పీఎస్ఎల్వీ సీ 45 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.27 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సీ 45 ద్వారా డీఆర్డీవోకు చెందిన ఎలక్ట్రానిక్ ఇంటలిజెన్స్ శాటిలైట్.. ఇమిశాట్ను నింగిలోకి పంపారు. దీంతో పాటు లిథువేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికాకు చెందిన 28 నానో ఉపగ్రహాలను వాటి కక్ష్యలో ప్రవేశపెట్టారు.
డీఆర్డీవో రూపొందించిన ఇమిశాట్ బరువు 436కిలోలు. తక్కువ ఎత్తు కక్ష్యలో తిరిగే ఈ ఉపగ్రహం రక్షణశాఖకు ఎంతగానో ఉపయోగపడనుంది. శత్రు దేశాల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని ఇది సేకరిస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి సమాచార సేకరణ కోసం భారత్ విమానాలపైనే ఆధారపడుతోంది. ఇకపై అంతరిక్షం నుంచే ఈ పని పూర్తి చేసే అవకాశం లభిస్తుంది.
Comments
English summary
Space agency ISRO launched the electronic intelligence satellite EMISAT along with 28 nano satellites of global customers from Sriharikota today. With this, India seeks to give birth to a new surveillance satellite with a special mission of the Polar Satellite Launch Vehicle (PSLV C-45) that has many firsts.
Story first published: Monday, April 1, 2019, 10:33 [IST]