IT Hub: అక్కాచెల్లి మీద దాడి కేసులో ముగ్గురి అరెస్టు, దెబ్బకు తేరుకున్న పోలీసులు !
బెంగళూరు: అక్కాచెల్లెలి పట్ల అసభ్యంగా ప్రవర్తించి వారి బట్టలు చింపేసి చితకబాదిన కేసులో బెంగళూరు పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఐటీ హబ్ సమీపంలో కలకలం రేపిన ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని ఆనేకల్ తాలుకాలోని సర్జాపుర సమీపంలోని దోమ్మసంద్రలో నివాసం ఉంటున్న సుబ్బారెడ్డికి శాంతిప్రియా, భానుప్రియా అనే కుమార్తెలు ఉన్నారు.
Family: రెండో భార్య మోజులో కానీస్టేబుల్, మొదటి భార్య కొడుకు, కూతురు ఏం చేశారంటే ?, ఏదో అనుకుంటే!
అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రామక్రిష్ణారెడ్డి, ఇంద్రమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. సుబ్బారెడ్డి కుమార్తె శాంతిప్రియా ఆమె పిల్లల చదువు కోసం గత ఏడాది అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రామక్రిష్ణారెడ్డి దగ్గర రూ. 1 లక్ష అప్పు తీసుకుంది. అప్పు తీసుకున్న రూ. లక్ష రూపాయలకు శాంతిప్రియా ప్రతినెల రూ. 9 వేలు వడ్డీ చెల్లించింది.
Wife: భార్యకు అక్రమ సంబంధం, ప్రియుడి దగ్గర రూ. 30 లక్షలు స్వాహా, క్లైమాక్స్ లో భార్య,భర్త !
ఆ సందర్బంలో సునీల్ తో పాటు అతని తల్లిదండ్రులు రామక్రిష్ణారెడ్డి, ఇంద్రమ్మ కలిసి శాంతిప్రియాతో పాటు ఆమె సోదరి భానుప్రియా బట్టలు చింపేసి కర్రలతో దాడి చేశారని శాంతిప్రియా కేసు పెట్టింది. ఐటీ హబ్ ఈ సంఘటన కలకలం రేపింది. మొదట చోద్యం చూసిన పోలీసులు తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో చివరికి రామక్రిష్ణారెడ్డి, సునీల్ తో పాటు మరో వ్యక్తిని శనివారం అరెస్టు చేశారు.