వీరాట్ కోహ్లి ఫ్రెండ్ కు ఐటీ శాఖ షాక్: ఐపీఎల్ దెబ్బ, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో సోదాలు !
టీం ఇండియా క్యాప్టెన్ విరాట్ కోహ్లి ఫ్రెండ్ కు ఐటీ శాఖ షాక్.ఐపీఎల్ సమయంలో భారీ మొత్తంలో పన్ను ఎగవేత, దాడులు.బెంగళూరు, ఢిల్లీ, ముంబైలో ఏకకాలంలో సోదాలు, మాజీ సీఎం మనుమడు !
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి (రెండవ ముఖ్యమంత్రి) కెంగల్ హనుమంత్య మనుమడు, టీం ఇండియా క్యాప్టెన్ విరాట్ కోహ్లికి అత్యంత సన్నిహితుడు డాదక్టర్ టీ. వెంకటవర్దన్ కెంగల్ హనుమంతయ్యకు చెందిన బెంగళూరులోని ఇల్లు, కార్యాలయాల్లో గురువారం ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు.
బెంగళూరులోని వెంకటవర్దన్ ఇల్లు, కార్యాలయం, డీఎన్ఎ నెట్ వర్స్క్, ఇన్నోవేటివ్ మల్టీప్లెక్స్ కార్యాలయాలతో పాటు ఢిల్లీ, ముంబైలోని ఆయన కార్యాలయాలు, గెస్ట్ హౌస్ ల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఐపీఎల్ పోటీల సమయంలో భారీ మొత్తంలో పన్ను ఎగవేశారని వెంకటవర్దన్ మీద ఆరోపణలు ఉన్నాయి.
వీరాట్ కోహ్లికి అత్యంత సన్నిహితుడైన వెంకటవర్దన్ ముంబై కేంద్రంగా ఇన్నోవేటివ్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఆదాయనానికి మించిన ఆస్తులు సంపాధించారని, ఆదాయపన్ను ఎగవేశారని పసిగట్టిన ఐటీ శాఖ అధికారులు బెంగళూరు-బళ్లారీలోని వెంకటవర్దన్ ఇల్లు, కార్యాలయాలతో పాటు ముంబై, ఢిల్లీలో సోదాలు చేస్తున్నారు.