సీఎం సిద్దరామయ్య పోటీ, బాదామిలో ఐటీ దాడులు, రిసార్టులో సోదాలు, ఎమ్మెల్సీ, బళ్లారి శ్రీరాములు !
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల సందర్బంగా ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు నిఘా వేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోటీ చేస్తున్న బాదామి శాసన సభ నియోజక వర్గంపై నిఘా వేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు అర్దరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా దాడులు చేసి సోదాలు చేశారు. బాదామిలో సీఎం సిద్దరామయ్య మీద బళ్లారి ఎంపీ శ్రీరాములు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Recommended Video
ఎమ్మెల్మే రిసార్టు
బళ్లారి జిల్లా విజయనగర శాసన సభ నియోజక వర్గం నుంచి బీజేపీ టిక్కెట్ పై రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా పని చేసిన ఆనంద్ సింగ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో విజయనగర శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న ఆనంద్ సింగ్ కు బాదామి శివార్లలో ఖరీదైన రిసార్టు ఉంది.
కృష్ణ హెరిటేజ్
విజయనగర శాసన సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేస్తున్న ఆనంద్ సింగ్ కు బాదామి శివార్లలో కృష్ణ హెరిటేజ్ అనే రిసార్టు ఉంది. సోమవారం అర్దరాత్రి దాటిన తరువాత ఆదాయపన్ను శాఖ అధికారులు ఒక్కసారిగా రిసార్టులో దాడులు చేశారు.
సీఎం సిద్దూ సన్నిహితుడు
కృష్ణ హెరిటేజ్ రిసార్టు లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితుడు, ఎమ్మెల్సీ సీఎం. ఇబ్రహీం అక్కడే ఉన్నారని తెలిసింది. మూడు గంటల పాటు సీఎం ఇబ్రహీం కృష్ణ హెరిటేజ్ రిసార్టు లో ఉన్న సమయంలోనే ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.
వేకువ జామున
ఆదాయపన్ను శాఖ అధికారులు కృష్ణ హెరిటేజ్ రిసార్టు లో క్షుణ్ణంగా పరిశీలించి వివిధ పత్రాలు పరిశీలించారని తెలిసింది. ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన తరువాత సీఎం సిద్దరామయ్య సన్నిహితుడు, ఎమ్మెల్సీ సీఎం. ఇబ్రహీం మంగళవారం వేకువజామున రిసార్టు నుంచి బయటకు వెళ్లిపోయారు.
సీఆర్ పీఎఫ్ బందోబస్తు
కృష్ణ హెరిటేజ్ రిసార్టు లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన సమయంలో సీఆర్ పీఎఫ్, బాదామి పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. 10 మంది ఆదాయపన్ను శాఖ అధికారులు కృష్ణ హెరిటేజ్ రిసార్టు లో సోదాలు చేశారు. సీఎం సిద్దరామయ్యను ఎలాగైనా గెలిపించాలని భారీ మొత్తంలో కృష్ణ హెరిటేజ్ రిసార్టు లో నగదు దాచిపెట్టారని సమాచారం అందడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారని సమాచారం.