అశోక్ గెహ్లట్ సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్, ముంబై, ఢిల్లీలో కూడా..
రాజస్తాన్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. సచిన్ పైలట్ ధిక్కారస్వరం వినిపించగా.. అతనిని దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంతలో రాజస్థాన్, ఢిల్లీ, ముంబైలో ఐటీ దాడులు కలకలం రేపింది. అశోక్ గెహ్లట్ సన్నిహితుల ఇళ్లలో రైడ్స్ జరగడం బట్టి చూస్తుంటే.. రాజస్తాన్ సర్కార్ను కేంద్రం టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
ముంబైలో మయాంక్ శర్మ ఎంటర్ ప్రైజేస్, ఓం కోటారి గ్రూపునకు చెందిన 8 లోకేషన్లలో దాడులు నిర్వహించారు. మయాంక్ శర్మ ఎంటర్ ప్రైజెస్ ట్రిటాన్ హోటల్స్కు చెందినవి. దీని పెట్టుబడిదారు రతన్ కాంత్ శర్మకు అశోక్ గెహ్లట్ కుమారుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదివరకు అతనిని మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ విచారించింది. మారిషస్ ఆధారిత సంస్థ, ట్రిటాన్ కంపెనీ పన్ను ఎగవేత కేసులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
Recommended Video
అయితే ముంబైలో గల శర్మ కార్యాలయాల్లో రైడ్స్ నిర్వహించారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కానీ శర్మ మాత్రం ఇక్కడ లేరు అని ఐటీ అధికారులు తెలిపారు. ఓంకారి గ్రూపు కూడా గెహ్లట్ సంబంధీకులదీ కావడం విశేషం. అందుకే కక్షతో దాడులు నిర్వహిస్తున్నారని గెహ్లట్ సన్నిహితులు అంటున్నారు.