వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటన కన్నా రాజకీయానికే ప్రాధాన్యం: ఎంపి చిరాగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నటన కన్నా రాజకీయ జీవితానికే తాను ప్రాధాన్యత ఇస్తానని పార్లమెంటుసభ్యుడు, బాలీవుడ్ నటుడు చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఈయన కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు.

గురువారం చిరాగ్ మాట్లాడుతూ.. ‘నటన అనేది ఒక అంశానికి సంబందించినది. నటనపై ఉన్న మక్కువతో ఆ కోరికను తీర్చుకున్నా. కానీ ఇప్పుడు నేను పూర్తి స్పష్టతతో ఉన్నాను. రాజకీయమే నాకు సరైన వేదిక. దీనినే చివరి వరకు కొనసాగిస్తా' అని ఎంపి చిరాగ్ పాశ్వాన్ అన్నారు.

It's politics over acting for Chirag Paswan

తాను రాజకీయాలను అంత తేలికగా తీసుకోవడం లేదని చెప్పారు. తనకు పార్టీలోని సీనియర్ నాయకులు పూర్తిగా తమ సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు. ఇక తన జీవితంలో రాజకీయానికే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన చిరాగ్ పాశ్వాన్.. జమూయి లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన 2011లో ‘మిలేనా మిలేహం' అనే బాలీవుడ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి తన్వీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, చిరాగ్ సరసన నటి కంగనా రనౌత్ నాయికగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలుకావడంతో మళ్లీ ఆయన బాలీవుడ్‌లో అడుగుపెట్టలేదు.

English summary
Chirag Paswan, son of Union Minister and Lok Jan Shakti Party leader Ram Vilas Paswan, may have started his career with a Bollywood movie but the first time MP says now his sole focus is politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X