వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లిదండ్రులను తీసుకొచ్చి లొంగిపోవాలన్నా..: ఎన్‌కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా, ఆదివారం జదిబాల్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆదివారం జదిబాల్, పోజ్వల్ పోరా ప్రాంతాల్లో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదుల జాడను పసిగట్టారు.

అదే సమయంలో ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. అయితే, ఆ ఉగ్రవాదుల తల్లిదండ్రులను ఘటనా స్థలానికి తీసుకొచ్చిన భద్రతా దళాలు.. వారితో లొంగిపోవాలని చెప్పించాయి. అయినప్పటికీ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

 J&K: 3 terrorists killed in encounter with security forces in Srinagar

కాగా, మరణించిన వారిలో ఒకరు 2019 నుంచి టెర్రరిస్టుల ఆపరేషన్స్‌లో యాక్టివ్ ఉన్నాడని, మరొకరు మే నెలలో బీఎస్ఎఫ్ సిబ్బందిపై జరిగిన దాడిలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బందితోపాటు ఓ పోలీసు గాయపడ్డారు.

ఈ మేరకు వివరాలను కాశ్మీర్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో శ్రీనగర్‌లో తాత్కాలికంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు తెలిసింది.

కాగా, శ్రీనగర్‌లో కేవలం ఒక నెల వ్యవధిలోనే ఇది రెండవ ఎన్ కౌంటర్ కావడం గమనార్హం. గత మే నెలలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

English summary
At least three terrorists were killed in an encounter with security forces in Zadibal area of Jammu and Kashmir's Srinagar on Sunday, Kashmir Zone Police said. All the terrorists were holed up inside a house in the Zadibal area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X