వరుస ఎన్కౌంటర్లు: 8మంది ఉగ్రవాదుల హతం, నలుగురు జవాన్లకు గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో తాజాగా చోటు చేసుకున్న వరుస ఎన్కౌంటర్లతో ఉగ్రవాదులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ సరిహద్దు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
సోఫియాన్ జిల్లాలో రెండు చోట్ల, అనంతనాగ్ జిల్లాలో ఒకచోట ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సోఫియాన్ జిల్లా కచ్చాదోరా ఏరియా, ద్రాగాడ్ గ్రామాల్లోకి సాయుధులు చొరబడ్డారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.
ఈ
క్రమంలో
ఎదురుకాల్పులు
చోటుచేసుకోగా
ఏడుగురు
ఉగ్రవాదులు
హతమయ్యారు.
ఉగ్రవాదుల
కాల్పుల్లో
నలుగురు
జవాన్లకు
గాయాలయ్యాయి.
అటు
అనంతనాగ్
జిల్లాలోని
దైల్గావ్
ప్రాంతంలో..
ఉగ్రవాదులు,
పోలీసులకు
మధ్య
ఎదురుకాల్పులు
జరిగాయి.
ఈ ఘటనలో ఒక మిలిటెంట్ హతమయ్యాడు. కాగా, మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు వేట కొనసాగిస్తున్నాయి.