వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరుస ఎన్‌కౌంటర్లు: 8మంది ఉగ్రవాదుల హతం, నలుగురు జవాన్లకు గాయాలు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో తాజాగా చోటు చేసుకున్న వరుస ఎన్‌కౌంటర్లతో ఉగ్రవాదులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ సరిహద్దు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

సోఫియాన్‌ జిల్లాలో రెండు చోట్ల, అనంతనాగ్‌ జిల్లాలో ఒకచోట ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సోఫియాన్‌ జిల్లా కచ్చాదోరా ఏరియా, ద్రాగాడ్‌ గ్రామాల్లోకి సాయుధులు చొరబడ్డారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.

J&K: 8 terrorists gunned down by security forces in Shopian


ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకోగా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. అటు అనంతనాగ్‌ జిల్లాలోని దైల్‌గావ్‌ ప్రాంతంలో.. ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో ఒక మిలిటెంట్‌ హతమయ్యాడు. కాగా, మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు వేట కొనసాగిస్తున్నాయి.

English summary
Around Eight terrorists were gunned down by security forces in Jammu and Kashmir's Shopian district on Sunday morning.
Read in English: J&K: Seven terrorist killed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X