వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసియూలో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రికి చికిత్స

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌ను బుధవారం ఐసియూకు తరలించారు. సయీద్‌కు ఆక్సిజన్ థెరపీ అవసరమని, వైద్య నిపుణుల బృందం ఆయన పరిస్థితిని సమీక్షిస్తోందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.

డిసెంబర్ 24న సీఎం ముఫ్తీ సయీద్‌కు జ్వరం, ఛాతినొప్పి రావడంతో చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఢిల్లీకి తరలించి ఎయిమ్స్‌లో చేర్చారు. సయీద్‌కు తోడుగా ఆయన కుమార్తె, పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వచ్చారు.

J-K CM Mufti Sayeed shifted to ICU in AIIMS

కాగా, మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎయిమ్స్‌ను సందర్శించి సయీద్ ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. సీఎం సయీద్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది మార్చిలో జరిగిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పిడిపి.. బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

English summary
Jammu and Kashmir Chief Minister Mufti Mohammad Sayeed was shifted to the ICU in AIIMS in New Delhi on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X