రాళ్లు రువ్విన ఆందోళనకారులు: సీఆర్పీఎఫ్ వాహనం దూసుకెళ్లడంతో ఒకరు మృతి, ఉద్రిక్తత
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్లో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీనగర్ నౌహట్టా ప్రాంతంలో ఆందోళనకారులు సీఆర్పీఎఫ్ వాహనాన్ని చుట్టుముట్టడంతో డ్రైవర్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోవడానికి చేసిన ప్రయత్నంలో వాహనం ముగ్గురు యువకులపై నుంచి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో శ్రీనగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.

కాగా, సీఆర్పీఎఫ్ వాహనం ఓ సీనియర్ అధికారిని దింపి తిరిగి వస్తుండగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు అడ్డుకుని రాళ్లు రువ్వారని పోలీసులు వెల్లడించారు. దీంతో డ్రైవర్ అక్కడి నుంచి వచ్చేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
ఈ ఘటనతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా విమర్శలు చేశారు. తుపాకులు కాకుండా జీపులు ఉపయోగిస్తున్నారంటూ మండిపడ్డారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications