రాళ్లు రువ్విన ఆందోళనకారులు: సీఆర్పీఎఫ్ వాహనం దూసుకెళ్లడంతో ఒకరు మృతి, ఉద్రిక్తత
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్లో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీనగర్ నౌహట్టా ప్రాంతంలో ఆందోళనకారులు సీఆర్పీఎఫ్ వాహనాన్ని చుట్టుముట్టడంతో డ్రైవర్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోవడానికి చేసిన ప్రయత్నంలో వాహనం ముగ్గురు యువకులపై నుంచి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో శ్రీనగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.

కాగా, సీఆర్పీఎఫ్ వాహనం ఓ సీనియర్ అధికారిని దింపి తిరిగి వస్తుండగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు అడ్డుకుని రాళ్లు రువ్వారని పోలీసులు వెల్లడించారు. దీంతో డ్రైవర్ అక్కడి నుంచి వచ్చేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
ఈ ఘటనతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా విమర్శలు చేశారు. తుపాకులు కాకుండా జీపులు ఉపయోగిస్తున్నారంటూ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications