వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లో ఎదురుకాల్పులు: నలుగురు మిలిటెంట్ల హతం

By Pratap
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: కాశ్మీరులోని బుద్గాంలో సైన్యానికి, మిలిటెంట్లకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మిలిటెంట్లు దాక్కున్నారని తమకు అందిన సమాచారం మేరకు భారత సైన్యం ఓ ఇంటిని చుట్టుముట్టింది.

మిలిటెంట్లకు, సైన్యానికి మద్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు మరణించినట్లు సమాచారం. భారత సైనిక వర్గాలు విషయాన్ని ధ్రువీకరించాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాంలోని ఫుల్తిపొరా గ్రామంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో ఇద్దరు యువకులు గాయపడ్డారు. సైన్యం, సిఆర్‌పిఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి.

J-K: Four militants gunned down in Budgam

భారత బలగాలను చూడగానే మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ప్రతి భారత బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. బుద్గాం జిల్లాలో ఇంటర్నెట్ సేవలను ఆపేశారు.

ఇదిలావుంటే, ఉత్తర కాశ్మీర్‌లోని బారముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య మరో ఎన్‌కౌంటర్ జరుగుతోంది.

English summary
Four militants were gunned down by the security forces in an encounter at Fultipora village in Budgam in Jammu and Kashmir on Thursday, confirmed an Army PRO. Two youths have also sustained injuries in the encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X