కొనసాగుతున్న కూంబింగ్: చొరబాటుదారుడి కాల్చివేత
శనివారం తెల్లవారుజామున పఠాన్కోట్ ప్రాంతంలో చొరబడేందుకు ఉగ్రవాదులు విఫలయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారు.
న్యూఢిల్లీ: శనివారం తెల్లవారుజామున పఠాన్కోట్ ప్రాంతంలో చొరబడేందుకు ఉగ్రవాదులు విఫలయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారు. కాల్పుల్లో చొరబాటుదారుడు మృతి చెందినట్లు గుర్తించారు. అక్కడ మరికొందరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పఠాన్కోట్ వద్ద సరిహద్దు వెంబడి గస్తీని పెంచారు.
కొనసాగుతున్న కూంబింగ్
జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లా పాక్ సరిహద్దు ప్రాంతంలో భారత భద్రతా బలగాలు, పాక్ తీవ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులు ఘటన స్థలం నుంచి తప్పించుకుని పారిపోయినట్లు సమాచారం. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపారు.
కాగా, కాల్పుల్లో అసదుల్లా కుమార్ అనే సాధారణ పౌరుడు మృతిచెందాడు. కాశ్మీర్ మత్స్య శాఖలో ఉద్యోగి అయిన ఆయన విధులు ముగించుకొని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.