భారత్ వ్యతిరేక ర్యాలీ: పాక్ జెండాను ప్రదర్శించిన మసరత్ ఆలం(ఫొటోలు)
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు మసరత్ ఆలం భట్ మరో వివాదాస్పద చర్యకు పాల్పడ్డాడు. బుధవారం హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీ జిలానీ రాక సందర్భంగా శ్రీనగర్లో నిర్వహించిన ర్యాలీలో పాకిస్థాన్ జాతీయ జెండాను ప్రదర్శించాడు. ఐదేళ్ళ తర్వాత తొలిసారిగా శ్రీనగర్లో అడుగుపెట్టిన జిలానీకి స్వాగతం పలుకుతూ పలువురు యువకులతో ఆలం నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మసరత్ ఆలంతోపాటు ర్యాలీలో పలువురు పాకిస్థాన్ జెండాలు ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా పాకిస్థాన్కు అనుకూలంగా, భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో యువకులు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై రాళ్లు కూడా రువ్వారు.
పాక్ జెండాను ప్రదర్శించడమేగాక దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకుగాను మసరత్ ఆలం, జిలానీతోపాటు పలువురిపై పోలీసులు అసాంఘిక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు.
#ReArrestMasarat
now!Freed
separatist
leader
Masarat
Alam
holds
anti-India
rally
in
Srinagar,
raises
Pakistani
flag
pic.twitter.com/dgOmSbXFZI
—
TIMES
NOW
(@TimesNow)
April
15,
2015
మసరత్ ఆలం చర్య పట్ల బిజెపి నాయకుడు జివిఎల్ నర్సింహ మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలు తాము అంగీకరించబోమని చెప్పారు. ఇలాంటి చర్యలపై ముఫ్తీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా, మసరత్ ఆలం చర్య కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
This
is
outrageous.
J&K
Governor
should
dismiss
BJP-PDP
government:
Manish
Tewari,
Congress
#ReArrestMasarat
—
TIMES
NOW
(@TimesNow)
April
15,
2015
జమ్మూకాశ్మీర్లోని బిజెపి-పిడిపి ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేయాలని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వేర్పాటువాదుల పట్ల సున్నితంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి చర్యలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.
The
manner
in
which
Pak
flag
were
being
raised
in
a
protest
in
Srinagar
is
completely
unacceptable:
GVLN
Rao
on
Masarat
Alam
&
SAS
Geelani
—
ANI
(@ANI_news)
April
15,
2015
2010లో హింసకు దారితీసిన నిరసన చేపట్టినందుకు జైలుపాలైన మసరత్ను.. ఇటీవల ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలోని పిడిపి-బిజెపి ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.
రాజ్నాథ్ సీరియస్
భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు పాక్ జెండాను ప్రదర్శించిన వేర్పాటువాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూకాశ్మీర్ ముఫ్తీ ప్రభుత్వాన్ని సూచించారు. ఈ చర్యను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని అన్నారు.