వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భద్రతా సిబ్బంది వాహనంపై ఉగ్రదాడి: ఐదుగురు జవాన్లకు గాయాలు
జమ్మూకాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. భద్రతాసిబ్బంది వాహనంపై దాడి చేసి కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు జవాన్లు గాయాలపాలయ్యారు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. భద్రతాసిబ్బంది వాహనంపై దాడి చేసి కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు జవాన్లు గాయాలపాలయ్యారు. అనంత్నాగ్ జిల్లాలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం అనంత్నాగ్లోని లాజిబల్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో.. ముష్కరులు అక్కడి నుంచి పారిపోయారు.
ఈ ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. దాడుల నేపథ్యంలో ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతమంతా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి.
Comments
jammu and kashmir terrorists crpf terror attack soldiers jawans injured జమ్మూకాశ్మీర్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ ఉగ్రదాడి జవాన్లు గాయాలు
English summary
Five jawans were injured in Jammu and Kashmir's Anantnag district after a CRPF vehicle was attacked by the terrorists on Thursday.