వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్ర కాల్పులు: నలుగురు పోలీసులు మృతి

|
Google Oneindia TeluguNews

షోపియాన్‌: జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో బుధవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పోలీస్‌ వాహనాన్ని బాగుచేసుకునేందుకు వెళ్లిన పోలీసులపై విచక్షణారహితంగా ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

కాగా, చనిపోయిన పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలను ఉగ్రవాదులు అపహరించుకుపోయారు. షోపియాన్‌లోని అర్హామా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

J&K: Terrorists attack a police party in Shopian, four cops martyred

పోలీసులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఏడాది కాశ్మీర్‌ లోయలో పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు 30 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

ఇది ఇలా ఉండగా, అనంత్‌నాగ్‌ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే పోలీసులపై దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది.
ఈ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ అల్తఫ్‌ అహ్మద్‌ దార్‌ హతమయ్యాడు. ఈ దాడికి ప్రతీకారంగానే పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఉంటారని భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు.

English summary
In a major attack on a police party by the terrorists, four cops were killed on Wednesday in Jammu and Kashmir's Shopian region, said reports. The attack took place in Shopian's Arahama area. As per reports, three AK-47s of the martyred policemen were also taken away by the terrorists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X