ఉగ్ర కాల్పులు: నలుగురు పోలీసులు మృతి
షోపియాన్: జమ్మూకాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో బుధవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పోలీస్ వాహనాన్ని బాగుచేసుకునేందుకు వెళ్లిన పోలీసులపై విచక్షణారహితంగా ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
కాగా, చనిపోయిన పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలను ఉగ్రవాదులు అపహరించుకుపోయారు. షోపియాన్లోని అర్హామా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఏడాది కాశ్మీర్ లోయలో పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు 30 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
ఇది
ఇలా
ఉండగా,
అనంత్నాగ్
జిల్లాలో
బుధవారం
జరిగిన
ఎన్కౌంటర్లో
ఇద్దరు
హిజ్బుల్
ముజాహిద్దీన్
ఉగ్రవాదులను
భద్రతా
బలగాలు
హతమార్చాయి.
ఈ
ఘటన
జరిగిన
గంటల
వ్యవధిలోనే
పోలీసులపై
దాడి
చేయడం
కలకలం
సృష్టిస్తోంది.
ఈ
ఎన్కౌంటర్లో
హిజ్బుల్
టాప్
కమాండర్
అల్తఫ్
అహ్మద్
దార్
హతమయ్యాడు.
ఈ
దాడికి
ప్రతీకారంగానే
పోలీసులపై
ఉగ్రవాదులు
కాల్పులు
జరిపి
ఉంటారని
భద్రతా
సిబ్బంది
అనుమానిస్తున్నారు.