వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి: తమ పనేనంటూ లష్కరే తొయిబా

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. అచాబల్‌ పట్టణంలో భద్రతా సిబ్బంది క్యాంపుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయాలపాలయ్యారు.

కాల్పుల్లో ఓ పౌరుడు కూడా గాయపడ్డాడు. ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్‌ సిబ్బందిపై కాల్పులు జరపగా, జవాన్లు ఎదురుకాల్పులు జరిపారని అధికారులు వెల్లడించారు.చనిపోయిన ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లను అసిస్టెంట్‌ సబ్‌-ఇన్స్‌పెక్టర్‌ మీనా, కానిస్టేబుల్‌ సందీప్‌లుగా గుర్తించారు.

J&K: Two CRPF jawans killed in Anantnag attack, LeT claims responsibility

కాల్పులు జరిగిన ప్రాంతంలో భద్రతను పెంచిన పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా పేర్కొంది.

English summary
Two CRPF jawans were killed and one injured in a militant attack in Jammu and Kashmir's Anantnag district today, official sources said. Lashkar e Toiba (LeT) has claimed responsibility for the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X